ప్రత్యేక కధనం : సీనియర్ జర్నలిస్ట్ ఆది
ఈ స్టోరీ మొత్తానికి లీడ్ ఏంటంటే.. ఒక్కో ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయకుండా వాటి ఆనవాళ్లు కావాలని అలాగే ఉంచడం, ఉదాహరణకు నంది అటు దిరిగి ఉన్నా అలాగే వదిలేయడం అదే సమయంలో శృంగార గౌరి ఆలయ ఆనవాళ్లు,జ్ఞానవాపి మసీదు వెనక గోడలపై ఉన్న హిందూ దేవతాకృతులు.. అంతా నాటి ఔరంగజేబీయులకు చెందిన
ఒక ఎత్తుగడ..
ఒక సవాల్..
ఒక హెచ్చరిక..
ఒక మెసేజ్..
ఒక ఎక్స్ ప్రెషన్..
అంటే దానర్ధమేంటంటే.. మాతో పెట్టుకుంటే అట్లుంటది.. ఏం చేస్కుంటారో చేస్కోండంటూ.. ఔరంగజేబ్ తదితరులు హిందువులను చెప్పుతో కొట్టినట్టు చెప్పక చెప్పే.. అహంకార పూరిత వ్యవహార జ్ఞానానికి సంబంధించిన విధమిది.. ప్రార్ధనాలయాల యధాతథ స్థితి కొనసాగించాలంటూ
పీవీ హయాంలో వచ్చిన 1991 యాక్ట్ ప్రకారం మాట్లాడితే.. జ్ఞానవాపిలాంటి మసీదులను అస్సలు కదల్చ కూడదు.. కానీ.. ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ.. దేన్నయినా తారు మారు చేయగల సమర్ధత చాకచక్యం ప్రదర్శిస్తూ ముందుకెళ్తోంది.. ఆ మాటకొస్తే.. ఈ సారికల్లా భారత్ సెక్యులర్ కంట్రీ పొజిషన్ నుంచి హిందూ దేశంగా మార్చినా మార్చేస్తుంది.. ఇందుకు మన ఎంపీ అరవిందన్న మాటలే అత్యంత నిఖార్సైన ఆధారం.. ఈ కండీషన్లో ఎప్పుడో జమానా కాలం నాటి పీవీ కాలంలోని చట్టాలను గౌరవిస్తుందా ఏంటి? ఇదంతా అలా ఉంచితే..
ఇది కరెక్టా కాదా? అన్న తర్క మీమాంశకు ఇక్కడ ఆస్కారమేర్పడుతోంది.. వాస్తవానికి చెబితే కాదు.. కూడదు.. ఎందుకంటే చట్ట ప్రకారం..
ప్రస్తుత లౌక్య లోక స్వరూప స్వభావాల ప్రకారం.. భారత దేశపు ఆత్మ గతంలో ఆవిష్కృతమైన దాని ప్రకారం.. మత విద్వేషాలను రెచ్చగొట్టడం కరెక్టు కాదు..
అయితే..
అయితే..
అయితే..
వాళ్లకు బలమున్నపుడు వాళ్లు చేశారు.. మాకు బలమున్నపుడు మేమూ అలాగే చేస్తాం.. అయినా నిఖార్సుగా కట్టిన మసీదులు చర్చిలను మేమేం కూల్చేస్తామనడం లేదే.. ఆనాడు అంత సవాలు విసిరిన ఔరంగజేబ్ తదితరులకు మనం ఈ మాత్రమైనా జావాబు ఇవ్వాలిగా.. లేకుంటే.. ఇన్నేసి కోట్లల్లో ఉన్న జాతి విలువేం కాను ??? అన్నది హిందువులంతా ముక్తకంఠంతో అంటోన్న మాట.. ఇప్పటి వరకూ అవలంభిస్తూ వస్తోన్న సహనం ఇక చాలు.. మైనార్టీలు కదా… అలుసిచ్చినందుకు వచ్చే రోజుల్లో మనమే వాళ్ల స్థానానికి చేరి.. వాళ్లు మన మెజార్టీ స్థానాన్ని ఆక్రమించేలా ఉన్నారు… ఇప్పటి వరకూ ఓటు బ్యాంకు రాజకీయాల కొద్దీ నెత్తికెత్తుకున్నది చాలు.. ఇకపై ఇలా కుదరదు
అంతా మనం అనుకున్నట్టే జరగాలి.. ఆల్రెడీ అఖండ భారత్ దిశగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉంటే.. జ్ఞానవాపి ఒక లెక్కా!? ఆసియా ఖండంలో సగం ఆక్రమించి.. గతంలో ఉన్న భారత ఉప ఖండం అనే బిరుదును సార్ధకం చేస్కోవాలని చూస్తుంటే.. వీళ్లెంత వీళ్లె నీల్గుడెంత?
అన్నది సదరు హిందుత్వ వాదుల ప్రధాన ఆలోచనగా తెలుస్తోంది.. అయినా ఇలాగే వదిలేస్తే.. హిందుత్వ మూలాలు మరింత కోల్పోయే ప్రమాదముంది.. అందుకే ఏళ్లనాటి డిమాండ్- 370 ఆర్టికల్ విషయంలో అంత కఠిన నిర్ణయం తీసుకుంది.. కామన్ సివిల్ కోడ్ కూడా ఏమంత దూరంలో లేదు.. సాలిడ్ గా గట్టి పడుతోన్న హిందుత్వ ఓటు బ్యాంకును బట్టీ చూస్తుంటే.. ఈసారి కి కూడా.. కమల ప్రభుత్వం ఖాయం.. ఈ మూమెంట్లో ఒకరి మనోభావాలను పట్టించుకునే తీరికే లేదు.. ఆ మాటకొస్తే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం హిందుత్వ ఓటు బ్యాంకును ఆకర్షించుకునే ఎత్తుగడలు వేస్తుంటే.. ఇక మైనార్టీ ఓట్ పాలి.. ట్రిక్స్ కి కాలం చెల్లినట్టే లెక్క.. అయినా వాళ్లేం ఒరిజినల్ కారు.. కొన్ని లెక్కల ప్రకారం మాట్లాడితే.. ఒకానొక రోజుల్లో 9 కోట్ల మంది దళితులు ఇస్లాంలోకి వెళ్లారంటోంది చరిత్ర.. అందులో భాగంగా మాట్లాడితే.. వాళ్లే తమ మతం మారి.. ఈ మతంలోకి వచ్చేయడం బెటర్.. ఒక వేళ మారకున్నా.. ఈ మార్పులను అంగీకరించక తప్పని దుస్థితి.. ఒకానొక రోజుల్లో పాక్ లో ఒక రేంజ్ లో ఉన్న హిందువులు ఇవాళ రెండు మూడు శాతానికి పడిపోలేదా? ఇక్కడ కూడా అంతే.. అసలు పాకిస్థాన్నే లేకుండా చేసేయాలని చూస్తుంటే.. ఇదెంత ? అన్నది ఒక లాజిక్కు.. ఇకపై ఇక్కడ ఆ మతం ఈ మతం అనడానికి వీల్లేదు.. ఉన్నదంతా ఒకటే మతం ఉండాల్సిందంతా ఒకటే మతం..
ఈ మధ్య ఎంపీలో కావచ్చు.. ఒక హిందూ వృద్ధుడ్ని నువ్వు ముస్లమానువా? అంటూ కొట్టడానికి వస్తే.. ఇకపై ఇలాంటి అరాచకాలు ఇంకెన్ని జరుగుతాయో.. ఊహించుకోవచ్చు.. గడ్డం, టోపీలకు వచ్చే రోజులలో గడ్డుకాలమే అని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు.. ఇప్పటికే ముస్లిం మతస్తుల మనుగడకు కష్టకాలం దాపురించింది.. మసీదులకు చోటిచ్చి.. వాళ్ల కట్టే కడతేరి పోయాక ఆరడుగుల నేలంటూ..
బొచ్చె బోలెడు సమాధులకు స్థానం కల్పించి.. దేశంలో ఇంకేం లేదా? ఈ మసీదులు, స్మశానాలను చూస్తూ కూర్చోవాలా? అయినా ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్న హిందువుల భౌతిక కాయాలే దహన ప్రక్రియ ద్వారా గాల్లోకి కలిసి పోతుంటే ఈ దేశాన్ని గౌరవించం భారత మాతకు జై అనం అంటూ కావల్సినంత బెట్టు ప్రదర్శించే ముస్లిములకు.. ఈ దేశపు మట్టిలో కలిసిపోవాలన్న వింత కోరికేంటి ? అందుకే ఇకపై ఈ స్మశానాలు కూడా లేకుండా చేసేస్తాం.. అంటూ హైందవ జాతి ఊగిపోతుంటే.. జ్ఞానవాపి లాంటి ఘటనలు చాలా చాలా చిన్న విషయాలు..
ఇప్పటి వరకూ జరిగింది వేరు.. ఇకపై జరిగేది వేరు.. ఏమంటారు???