మంచు లక్ష్మి టాలీవుడ్ లో నటిగా, నిర్మాతగా, సింగర్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. మంచు మోహన్ బాబు కుతురిగా సినీ రంగంలో అడుగు పెట్టిన లక్ష్మి ప్రసన్న తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఈ భామ మరోసారి వార్తల్లో నిలిచింది.
తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. కేవలం నటిగానే కాకుండా సింగర్గా, నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అమెరికాలో ఉన్న సమయంలో కొన్ని హాలీవుడ్ సిరీస్లో నటించిన మంచు లక్ష్మి తర్వాత ఇండియాకు తిరిగొచ్చారు. అనంతరం ‘అనగనగా ధీరుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె అద్భుత నటనగాను కూడా నంది అవార్డును సైతం అందుకున్నారు.
ప్రతి ఏడాది టీసీ కండ్లెర్ అనే మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా ఉండే 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ సినీ ఉమెన్ జాబితాను విడుదల చేస్తుంది. ఈ జాబితాలో ఈ ఏడాదికి మంచు లక్ష్మి స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. తనను నామినేట్ చేసిన కండ్లెర్ మ్యాగజైన్కు ధన్యవాదాలు తెలిపింది.
టీసీ కండ్లెర్ అనే సంస్థ 1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేమస్ సినిమా, టీవీ, పాప్ ఆర్టిస్ట్లకు ఈ జాబితాలో చోటు కల్పిస్తోంది. లక్ష్మి మంచుతో పాటు ప్రస్తుతం ఈ లిస్టులో మహీరాఖాన్, రామ్ చరణ్, మానుషీ చిల్లర్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం లక్ష్మి మంచు అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటిస్తూ నిర్మిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్ను అలరిస్తోంది. తన వ్యక్తిగత విషయాలు, వ్యాయమం వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తూ ఉంటుందీ మంచు లక్ష్మి. సామాజిక కార్యక్రమాలలో కూడా ఎంతో చురుకుగా పాల్గొంటుంది.