Crime మూఢనమ్మకాలు రోజురోజుకీ పెట్టరేగిపోతున్నాయి ఈ పిచ్చిలో ఎవరో చెప్పారని కొందరు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు.. ఇలాంటి ఓ మాయలో పడి సొంత కూతుర్ని బలి ఇచ్చిన ఓ తండ్రి చేసిన పని ప్రస్తుతం అందరిని నివ్వెర పరుస్తుంది..
నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు ప్రతి ఒక్కరికి ఏవో ఒక సెంటిమెంట్లు ఉంటాయి వాటిని ఫాలో అవుతూ ఉంటారు అయితే అంతవరకు పర్లేదు కానీ అవి శృతిమించితేనే ప్రమాదం ఈరోజుల్లో చాలామంది ఏవో అతీంద్రియ శక్తులు వస్తాయని ఒక్కసారిగా కోట్ల డబ్బు వచ్చి పడుతుందని ఎవరో చెప్పిన మాయమాటలు నమ్మి నిండు జీవితాన్ని పని చేస్తున్నారు తాజాగా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి.. కొన్ని రోజుల క్రితం కేరళలో కూడా ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది.. ఎవరో చెప్పారని ఇద్దరు దంపతులు ఏకంగా నరబలి ఇచ్చి వారిని వండుకొని మరీ తిన్నారు ఈ విషయం మరువక ముందే మరో షాకింగ్ సంఘటన బయటపడింది..
గుజరాత్ రాష్ట్రంలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు సోమనాథ్ జిల్లాలో దావా గ్రామంలో నివాసం ఉంటున్న భవిష్ అక్బరి.. ఎవరో చెప్పారని క్షుద్ర పూజలు చేయించాడు అంతేకాకుండా తన 14 ఏళ్ల కుమార్తెతో కూడా ఈ పూజలన్నీ చేయించాడు.. ఆ పూజ జరుగుతుండగానే అకస్మాత్తుగా అమ్మాయిని నిప్పులు గుండంలోకి తోసేసాడు నిమిషాల్లో కళ్ళముందే ఆ అమ్మాయి సజీవ దహనం అయిపోయింది విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిగా అక్కడికి చేరుకున్నారు.. బాలిక తండ్రి తో పాటు అక్కడే ఉన్నా ఆమె తమ్ముడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి ఇలా చేస్తే అదే శక్తులు వస్తాయని అంతేకాకుండా బాలిక మళ్ళీ బయటపడుతుందని ఎవరో చెప్పారని ఇలా చేశామని
తెలిపారు