ఇబ్రహీంపట్నం ఘట్కేసర్ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో రాచకొండ భద్రతా మండలి వారి ఆకృతి కార్యక్రమం ద్వారా ప్రారంభమైన మూడవ బ్యాచ్ ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ కోర్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు-2024 సందర్భంగా, మహిళా ఫోరం-షీరా కార్యక్రమాలలో భాగంగా, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, రాచకొండ కమిషనరేట్-ఆకృతి (టైలరింగ్ ట్రైనింగ్ కోర్స్) సహకారంతో 3వ బ్యాచ్ను షీ టీమ్స్ రాచకొండ డీసీపీ శ్రీమతి ఉషా విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ కోర్సులో ప్రిన్సిపాల్ గుర్తించిన 25 మంది విద్యార్థుల బ్యాచ్ శిక్షణ పొందుతారు. మార్చి ఒకటవ తేదీన ఘట్కేసర్లో మహిళలకు సాధికారత & ఆర్ధిక స్వావలంబన అందించడంలో భాగంగా ఆర్కెఎస్సి “షీ ఎరా” ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద కుట్టు మిషన్లు మరియు శిక్షకులను ఎంపిక చేసి అందించారు మరియు శుక్రవారం టిఎస్డబ్ల్యుఆర్ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం ఘట్కేసర్లో మహిళల భద్రత మరియు సైబర్క్రైమ్ అవగాహనపై వర్క్షాప్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రాచకొండ షీ టీమ్స్ డీసీపీ శ్రీమతి ఉషా విశ్వనాథ్ ప్రసంగిస్తూ… సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తన ప్రసంగంలో, షీ టీమ్స్ డీసీపీ ఉషా విశ్వనాథ్ యువతకు వివిధ సైబర్-దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి వారికి సహాయపడేలా అనేక ఉపయోగకరమైన సూచనలను అందించారు. విద్యార్ధులు మరియు వారి కెరీర్పై దృష్టి పెట్టాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులకు చక్కటి భవిష్యత్ కెరీర్ కోసం అవసరమైన సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ప్రిన్సిపల్ డాక్టర్ రాధిక, రాచకొండ భద్రతా మండలి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు మరియు వివిధ కార్యక్రమాల ద్వారా సహకరిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేలా తోడ్పాటు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఫోరమ్ కోఆర్డినేటర్లు శ్రీమతి అర్చన మన్నె, శ్రీమతి నందిత, ఆర్కెఎస్సి చీఫ్ కోఆర్డినేటర్ శ్రీమతి సావిత్రి, ఫోరం సభ్యులు రజని, రాధిక, స్వర్ణ, నిఖత్, సూర్య తదితరులు పాల్గొన్నారు.