Crime : నైజీరియా దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది వరదలకు కారణంగా ప్రయాణికులతో వెళుతున్న ఒక బోటు బోల్తా పడింది ఈ ప్రమాదంలో 76 మంది జల సమాధి కావటం ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది..
వరదలు కారణంగా బోల్తా పడిన ఒక పడవలో ఉన్న 76 మంది జల సమాధి అయ్యారు.. ఈ హృదయ విధాకర సంఘటన నైజీరియా దేశంలో చోటుచేసుకుంది 85 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది..
నైజీరియా దేశంలో నైగర్ నదిపై వెళ్తున్న పడవలో ఈ ప్రయాణం జరిగింది ఈ నదికి ఒకసారిగా వరద తాకిడి పెరగడంతో.. బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దీంతో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 85 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీలైనంతవరకు కాపాడాలని ప్రయత్నించిన సాధ్యపడలేదని ప్రస్తుతం గల్లంతైన వారికోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 76 మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు…ఈ ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ విచారం వ్యక్తం చేశారు… అయితే ప్రతి ఒక్క రాజుకి తెలిసినంతవరకు గాలించాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో మరిప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు..