Crime ఉత్తర్ప్రదేశ్లోని సుల్తానాపూర్లో ఓ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కాలేజీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు దారిలో లిప్ట్ అడిగిన ఓ విద్యార్థినినీ… కదులుతున్న కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు… ఓ దుర్మార్గుడు. అనంతరం ఆమెను దారిలోని ఓ కాల్వ వద్ద పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బాధితురాలు ఇంటికి వెళ్లి చెప్పగా.. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని శుక్రవారం సాయంత్రం తన ఇంటికి వెళ్లేందుకు దారిలో ఓ కారును ఆపింది. కారులో ఎక్కించుకున్న వ్యక్తి… కొంచెం దూరం వెళ్లా… తన ఎస్యూవీ వాహనంలోనే ఆ యువతిపై డ్రైవరే అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆమె ఆరోపిస్తోంది. అఘాయిత్యం అనంతరం ఆమెను జైసింగ్పూర్ కాల్వ సమీపంలో కిందకు పడేసి అక్కడి నుంచి పరారయినట్లు తెలిపింది. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాలిక తనపై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు తెలపగా… వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జైసింగ్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు వెల్లడించారు. నేరానికి పాల్పడ్డ వ్యక్తిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని… అందుకోసం ప్రత్యేకంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు జైసింగ్పూర్ ర్కిల్ అధికారి ప్రశాంత్ సింగ్ తెలిపారు.