చిన్నపిల్లల చేతుల్లో ఏవైనా వస్తువులుంటే తీసేస్తూంటాం. ఎందుకంటే, వాళ్లు ఆ వస్తువులను నోట్లో పెట్టుకుంటే గనక గొంతులో ఇరుక్కునే ప్రమాదం గానీ, పొట్టలోకి వెళ్లే ప్రమాదం గానీ వుంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ప్రమాదంవల్ల పిల్లలు చనిపోయే విషాదకరమైన సంఘటనలూ జరుగుతూంటాయి. ఆ మధ్య ఇడ్లీ ముక్క ఓ చిన్నారి చనిపోయిన విషాద సంఘటన గురించి అందరూ వినే వుంటారు. అయితే, కొంతకాలం క్రితం ఓ వ్యక్తి కడుపులో ఏకంగా చెంచాల గుట్ట కనిపించింది.
అయితే, ఓ వృద్ధుడి పొట్టలో ఏకంగా గ్లాసు కనిపించడంతో వైద్యులు నిర్ఘాంతపోయారు. మధ్యప్రదేశ్లోని రాజ్ఘర్ జిల్లాలో జరిగిందీ ఘటన.
నాలుగు నెలల క్రితం రామ్దాస్ అనే వృద్ధుడు అమావత్ అనే గ్రామానికి వెళ్లాడు. అతడిని పట్టుకుని దారుణంగా కొట్టిన గ్రామస్థులు ఆపై అతడిని ఓ గ్లాసుపై కూర్చోబెట్టారు. అందరి సమక్షంలో బహిరంగంగానే ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరూ అడ్డుకోలేదు. ఈ క్రమంలో కూర్చున్న వృద్ధుడి పొట్టలోకి గ్లాసు జారుకుంది. అయితే, గ్రామస్థులు అతడిపై ఎందుకు దాడిచేశారన్న విషయం తెలియరాలేదు.
మరోవైపు, బాధిత వృద్ధుడు రామ్దాస్ ఈ విషయాన్ని సిగ్గుతో బయటపెట్టలేదు. ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత కడుపులో తరచూ విపరీతమైన నొప్పి వస్తుండడంతో చతుఖేడ చేరుకుని గ్రామస్థులకు విషయం చెప్పాడు. వారు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్రే తీయగా పొట్టలో గ్లాసు కనిపించడంతో వైద్యులు షాకయ్యారు. వృద్ధుడికి ఆపరేషన్ చేసి గ్లాసును వెలికి తీస్తామని వైద్యులు తెలిపారు.