మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్టి టీమ్వర్క్స్ మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాస్ మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకగా గ్రాండ్ గా జరిగింది. హీరో శ్రీ విష్ణు, దర్శకులు హరీష్ శంకర్, అనుదీప్, కృష్ణ చైతన్య, సందీప్ రాజ్, వంశీ, వెంకటేష్ మహా, నిర్మాత శరత్ మరార్, వివేక్ కూచిభొట్ల, ఎస్కేఎన్.. తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. హిలేరియస్, యంగేజింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీ పెంచింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ముందుగా ‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ నాకు విపరీతంగా నచ్చేసింది. సతీష్ కథ చెబుతున్నపుడు దర్శకుడు పాత వంశీ గారు గుర్తుకు వచ్చారు. ఆయనతో ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా చేశాను. అలాంటి హ్యుమర్, ఈస్ట్ గోదావరి వెటకారం, కథ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. తర్వాత ఛాంగురే బంగారురాజా’ పేరు మరింతగా నచ్చింది. మొదటి నుంచి సినిమా పై చాలా నమ్మకం వుంది. ఒక్క రోజు కూడా షూటింగ్ కి వెళ్ళలేదు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో దర్శకుడికి పూర్తి స్వేఛ్చ ఇచ్చాను. ఎందులోనూ కలుగజేసుకోలేదు .‘’నేను నిన్ను, కథను నమ్ముతున్నాను.
నీకు నమ్మకం ప్రకారం నీకు నచ్చింది చెయ్’’అని దర్శకుడితో చెప్పాను. నా నమ్మకం సెప్టెంబర్ 15న ప్రూవ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రొడక్షన్ టీం సినిమాకి కావాల్సింది సమకూర్చారు. మా టీం శ్వేత, శాలిని, ఆర్కే, శ్రీధర్, వింధ్యా రెడ్డి.. వీళ్ళంతా కలసికట్టుగా పని చేసారు. ఈ సినిమా విజయం సాధించి వారికి కూడా మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా వరకూ ఇందులో పని చేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఈ సినిమా తర్వాత వీరి పేర్లు మోతమ్రోగిపోవాలని కోరుకుంటున్నాను. ఇందులో రవి, ఎస్తర్ ట్రాక్ నాకు చాలా నచ్చింది. అలాగే ఇందులో చాలా ఎంజాయ్ చేసిన పాత్రలు సత్య, నిత్య. కార్తిక్, గోల్డీ కెమిస్ట్రీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కార్తిక్ ఇందులో చాలా ఎంటర్ టైనింగ్ రోల్ చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్ 15న ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు.