Crime ప్రేమించిన వాడు దక్కలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది అంతేకాకుండా అతని ఏమీ అనొద్దంటూ సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టింది ఈ షాకింగ్ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది..
ప్రేమించిన వాడి దక్కలేదని అఘాయిత్యనికి పాల్పడింది.. ప్రేమ ముసుగులో ఏకంగా తన ప్రాణమే తీసుకుంది.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నారాయణ పురానికి చెందిన ఓ అమ్మాయి నర్సింగ్ చదువుతుంది అయితే ఏమైందో ఏమో కానీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది ఈ పెళ్లి అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదని తెలుస్తోంది మత్తు ఇంజక్షన్ ఇచ్చుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడింది.. అయితే చావు బతుకుల్లో ఉన్న అమ్మాయిని గుర్తించిన ఆమె బంధువులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది అయితే తనను ప్రేమించిన అబ్బాయి చాలా మంచి వాడిని ఆ అబ్బాయిని ఏమీ అనొద్దని సూసైడ్ నోట్ రాసింది అంతేకాకుండా చనిపోయాక ఆ అబ్బాయి మీద ఎలాంటి కేసులో పెట్టొద్దని కూడా చెప్పక వచ్చింది.. గతంలో కూడా ఈ అమ్మాయి ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది అయితే అప్పుడు సరైన సమయంలో గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పిందని ఆమె సమీప బంధువులు చెప్పుకొచ్చారు అంతేకాకుండా అప్పట్లో కౌన్సిలింగ్ ఇచ్చారని దాంతో కొంత మార్పు వచ్చిన మళ్లీ ఇప్పుడు ఇలా జరిగిందంటూ వాపోయారు..