Politics తెలంగాణ రాష్ట్రంలో ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీకి.. ఇటు బీజేపీకి మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది. ఎవరు తగ్గేదే లేదంటూ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఇటు కేసీఆర్ విమర్శలు గుప్పిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ నాయకుల పై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా కుత్బుల్లాపూర్లో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన బండి సంజయ్.. నిధులు వినియోగం, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న నిధుల అంశాలపై కేసీఆర్ పలు సందర్భాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ విషయంపై మాట్లాడిన బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు.
కేంద్రం చేసిన బిల్లులో మోటార్ కి మీటర్ పెట్టాలని నిబంధన లేదని.. అలా కనుక ఉండి ఉంటే తాను రాజీనామా చేస్తానని.. లేకపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా..? అని సవాలు విసిరారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ చాలా అన్యాయం చేస్తున్నారని వారికి క్షమాపణ చెప్పాలని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణను మరో సింగపూర్ చేస్తానని మాట్లాడిన కేసీఆర్, కేటీఆర్ లు ఎక్కడ చేశారో చూపించమన్నారు. వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితి దారుణంగా ఉందని.. ఎక్కడికక్కడ గుంతలతో రోడ్లు మొత్తం పాడై ఉన్నాయని వీటన్నిటికీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.