Crime అతనో బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నాడు.. ఎందరికో రుణాలు మంజూరు చేశాడు అయితే చివరికి తానే అప్పులపాలై ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ షాకింగ్ సంఘటన యానంలో చోటుచేసుకుంది..
సాయిరత్న శ్రీకాంత్ (33) ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్ మేనేజర్ గా పని చేస్తున్నాడు అతను భార్య ఇద్దరు పిల్లల పిల్లలతో బ్యాంకు దగ్గరలోనే వద్ద ఇంట్లో ఉంటున్నాడు.. మంగళవారం ఆయన భార్య పిల్లలను స్కూలుకు దింపడానికి వెళ్లే సమయంలో ఆయన ఇంట్లో గదిలోకి వెళ్లి తలపేసుకొని ఉరేసుకున్నాను బయటి నుంచి వచ్చిన ఆయన భార్య తలుపులు ఎంత సేపు కొట్టిన తీయకపోయేటప్పటికి కిటికీలోంచి చూడగా శ్రీకాంత్ ఉరేసుకొని కనిపించారు వెంటనే తలుపులు పగలగొట్టి ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికైనా మరణించినట్టు వైద్యులు దృవీకరించారు..
శ్రీకాంత్ యానం బ్రాంచ్ కి రాకముందు మూడేళ్ల పాటు మచిలీపట్నంలో ఓ బ్యాంకులో మేనేజర్ గా పని చేశారు ఈ సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఎందరికో రుణాలు జారీ చేశారు.. ఈ రుణాలు తీసుకున్న వాళ్లు సరిగా చెల్లించకపోవడంతో 60 లక్షల వరకు బయట అప్పులు చేసి రుణాలు తీర్చారు ఆ తర్వాత బదిలీపై యానంకి వచ్చాక ఇక్కడ కూడా 37 లక్షల వరకు అప్పులు చేసి ఆ రుణాలు చెల్లించారని పోలీసులు తెలిపారు అయితే ఈ సమస్యలతో తన భర్త ఎప్పుడూ మానసికంగా బాధపడుతూ ఉండేవారని త్వరలోనే అప్పులన్నీ తీరిపోయి ఆనందంగా ఉండే రోజులు వస్తాయని గత రాత్రి చెప్పారని ఇంతలోనే ఇలా జరిగిందంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు..