Movie రణ్బీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. తొలిరోజు మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాన్ హాలిడే రోజు ఈ మూవీ విడుదలైనప్పటికీ భారీ వసూళ్లు సాధించడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8913 స్క్రీన్లల్లో విడుదలైన ఈ మూవీ రెండో రోజు దాదాపు రూ.85 కోట్ల మేర వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.160 కోట్లకు చేరిందని తెలిపింది. హిందీ తో పాటు మిగిలిన అన్ని భాషల్లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 2డీ వెర్షన్ తో పాటు త్రీడీకి కూడా చక్కటి ఆదరణ లభిస్తుందని వెల్లడించింది.
రూ.800 కోట్లు లాస్?.. అయితే ఈ సినిమాపై పెట్టుబడులు పెట్టిన పీవీఆర్, ఐనాక్స్ సంస్థలకు దాదాపు రూ.800 కోట్లు నష్టపోయాయని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా పీవీఆర్ సీఈవో కమల్ ఆ వార్తలపై స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలేవి నమ్మద్దని తెలిపారు తామేమి నష్టపోలేదని కలెక్షన్ల పరంగా లాభాలు బాగానే వస్తున్నాయని చెప్పారు. కొందరు తమపై నెగటివ్ ప్రచారం చేయాలని చూస్తున్నారని… సినిమాకి రెస్పాన్స్ చాలా బాగుందని అన్నారు. ఈ సినిమా వలన పీవీఆర్ వాళ్లు 800 కోట్ల వరకు నష్టపోతారని.. క్వీన్ కంగనా రనౌత్ సంచల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే..