Politics కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇందిరా రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.. ప్రభుత్వం విద్య కోసం ఎంతగా కృషి చేస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం గుర్తింపు లేదని వాపోయారు.. ఇందుకు అనుగుణంగా కావలసిన నిధులు మంజూరు చేయడం లేదని పేర్కొన్నారు..
ఒక మంచి సమాజాన్ని నిర్మించి విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.. సమాజాన్ని నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొవిడ్ సమయంలో విద్యార్థుల చదువు కోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఉత్తమ గురువులను మంత్రి సబితా సత్కరించారు. సమాజంలో డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి సబితా సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
“మన సంప్రదాయాలను, సంస్కృతి నైతిక విలువను బోధించేది ఉపాధ్యాయులు. తల్లిదండ్రులతో కన్న ఎక్కువ సమయం విద్యార్థులు మీతోనే ఉంటారు . విద్యలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నాం. విద్యార్థి సర్టిఫికెట్ తీసుకొని బయటకు వెళ్లితే కచ్చితంగా ఉద్యోగం దొరుకుతుందనే భరోసా ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు డిమాండ్ ఉన్న కోర్సులు ప్రవేశపెడుతున్నాం. రాష్ట్రప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుంది. ఇంత చేసిన కేంద్రం నుంచి ఎలాంటి గుర్తింపు లేదు. అందుకనుగుణంగా నిధులు విడుదల చేయడం లేదు.” అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.