సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు నేరాల నివారణకు వ్యూహాత్మక సమావేశాన్ని/ Strategy meeting ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా విజిబుల్ పోలింగ్ మరియు పెట్రోలింగ్, నేరాల నివారణ, సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్లో పురోగతి, వర్టికల్స్ క్రమబద్ధీకరణ, హిస్టరీ షీటర్స్, అడ్మిన్ సంబంధిత అంశాలు, నూతన పోలీస్ భవనాలకు సంబంధించిన అంతదితర అంశాలపై సిపి గారు డీసీపీలతో చర్చించారు.
ఈ కార్యక్రమం లో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ శ్రీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ ఇందిర, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి శ్రీమతి కవిత, సైబర్ క్రైమ్ ఏడిసిపి రీతిరాజ్, ఐపీఎస్., ఎస్ఓటి ఏడిసిపి నారాయణ, ఎస్బీ ఏడీసీపీ రవికుమార్, సిఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి రియాజ్, సిటిసి ఏసిపి రవీందర్ ఇతరులు పాల్గొన్నారు.