ఆన్లైన్, ఆఫ్లైన్ ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్మాయిలు, మహిళలను వేధించే ఆకతాయిలకు రాచకొండ షీ టీమ్స్ పోలీసులు అరదండాలు వేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారు. మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నారు. తొలిసారి చేసిన తప్పిదానికి చిక్కిన పోకిరీలకైతే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తప్పు పునరావృతమైతే కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలిస్తున్నారు.
రాచకొండ కమిషనర్ శ్రీ డిఎస్. చౌహాన్ గారి ఆదేశానుసారం, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రాచకొండ కమిషనరట్ పరిదిలో మహిళలను , యువతులను వేదింపులకు గురిచేస్తున్న 51 మందిని (మేజర్స్-15, మైనర్స్ -36) షీ టీమ్స్ వారు అరెస్టు చేసినారు. వారికి ఎల్బి నగర్ CP Camp office (she team office) నందు కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.
గత నెల జూలైలో 127 పిర్యాదులు అందినాయని డిసిపి విమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ శ్రీమతి టి. ఉషారాణి తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన పిర్యాదులలో ఫోన్ల ద్వారా వేదించినవి -25 , WhatsApp కాల్స్ & messages ద్వారా వేదించినవి -30, social media apps ద్వారా వేదించినవి- 20, నెరుగా వేదించినవి – 24, వివిధ మార్గాల్లో వేధించినవి -28 . వాటిలో క్రిమినల్ కేసెస్ -18, పెట్టి కేసెస్ -15, కౌన్సెల్లింగ్ – 94 కేసులు నమోదు చేశామన్నారు.
అందులో కేసులు కొన్ని…
గృహిణిని వేదిస్తున్న ఆటొ డ్రైవరు
హయత్ నగర్ ఏరియాలో నివాసముంటున్న గృహిణి , ఒక రోజు పని నిమిత్తం ఆటొలో వనస్థలిపురం వెళ్ళి , ఆటొ కిరాయి ఫోన్ పే ద్వారా చెల్లించింది. అట్టి ఫోన్ నెంబర్ ద్వారా ఆటొ డ్రైవరు హన్మ నాయక్ ఫోన్ కాల్స్ చేయడం మొదలు పెట్టినాడు. తరచుగా ఫోన్ చేసి అతను చెప్పినట్లు వినాలని, అతని కోరిక తీర్చాలని వేదించేవాడు. ఒకరోజు మద్య రాత్రి ఆమె ఇంటికి వెళ్ళి, నేను ఇప్పుడు నీ ఇంటిముందు వున్నాను, డోర్ తీస్తావా లేదా, డోర్ తీయక పోతే పగలగొడుతను అని బెదిరించినాడు, బాదితురాలు డోర్ తీయకపోయే సరికి కిటికీ అద్దాలు పగలగొట్టినాడు . ఇట్టి విషయమై SHE Teams కి ఫిర్యాదు చేయగా, హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.
పాఠశాల విద్యార్దులను వేదిస్తున్న పోకిరీలు
చిన్నకొండూర్ గ్రామములొని ZPHS Schoolలో షీ టీమ్ చౌటుప్పల్ వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తరువాత అందులోని 5 గురు విధ్యార్థులు SHE Team వారిని సంప్రదించి వారికి ప్రతిరోజూ జరుగుతున్న వేదింపులపై ఫిర్యాదు చేసినారు. వారు ప్రతి రోజు వారి గ్రామం నుండి స్కూల్కి సైకల్ పై వస్తుంటారు. మార్గమధ్యలో ఇద్దరు పోకిరిలు నెంబర్ లేని బైక్ పై వచ్చి వేదిస్తున్నారు. వెంటనే షీ టీమ్ చౌటుప్పల్ వారు ఆ ప్రాంతంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి పోకిరిలను అదుపులోకి తీసుకొని పెట్టి కేసు పెట్టి కోర్టులో హాజరుపర్చడం జరిగింది.
ప్రేమ పేరుతో సహోద్యోగిని వేదిస్తున్న వ్యక్తి
హయత్ నగర్ లో నివశిస్తున్న ఒక అవివాహిత అదే ఏరియాలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నది. ఆమె తోపాటు పని చేసే సహోద్యోగి గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయమై ఎన్ని సార్లు చెప్పిన వినకుండా వేదించేవాడు. తనను ప్రేమించాలని, లేకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెడతానని బెదిరించేవాడు. ఇట్టి విషయమై SHE Teams కి ఫిర్యాదు చేయగా, హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.
డెకాయ్ ఆపరేషన్
షీటీమ్ వనస్థలిపురంలోని పనామా, మీర్పేట, వనస్థలిపురం ఏరియాలో నిర్వహించి రోడ్డు మీద వెలుతున్న మహిళను, ఆడపిల్లలను వేదిస్తున్న ఇబ్బందులకు గురిచెస్తున్న 25 మందిని పోకిరిలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడం జరిగింది.
ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు, సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళలు వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే SHE Teams ని , Rachakonda WhatsApp నెంబర్ 8712662111 ద్వారా , లేదా ప్రాంతాల వారిగా Bhongir area- 8712662598, Choutuppal area – 8712662599, Ibrahimpatnam area -8712662600, Kushaiguda area -8712662601, LB Nagar area -8712662602, Malkajgiri area -8712662603 మరియు Vanasthalipuram area -8712662604 నెంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ డిసిపి శ్రీమతి టి. ఉషా రాణి , షీ టీమ్స్ ACP శ్రీ నరేందర్ గౌడ్, అడ్మిన్ ఎస్ఐ రాజు మరియు షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సంబంధాల అదికారి, రాచకొండ.