Crime News : నవమాసాలు మోసి కనిన పెంకిన తల్లి… కన్నా కొడుకునే కడతేర్చింది. కొడుకు ఉన్మాదాన్ని భరించలేక కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి చంపేసింది. ఈ ఘటనలో తల్లికి చిన్న కొడుకు కూడా సాయం చేయడం గమనార్హం. ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… అనంతపురం జిల్లా గుంతకల్లు ఆదర్శనగర్లో ఒక కుటుంబం నివాసముంటోంది. ఆ కుటుంబ పెద్ద కొడుకు భీమేష్.
మద్యపానానికి బాగా అలవాటు పడి పచ్చి తాగుబోతుగా మారాడు ఆ వ్యక్తి . రోజూ తాగొచ్చి తల్లిదండ్రులను, తమ్ముడిని చితకబాదడం, గొడవ పెట్టుకోవడం, డబ్బుల కోసం వేధించడం చేస్తూ ఉండేవాడు. ఇక తల్లి మందలించిన రోజు భీమేష్ మరింత రెచ్చిపోయేవాడు. తల్లి అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చుకొట్టి కొట్టేవాడు. ఇక ఆ దుర్మార్గుడి ఆగడాలను వారు భరించ లేక రెండు రోజుల క్రితం ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకొంది. చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకును చంపడానికి ప్లాన్ వేసింది.
ఎప్పటిలానే మొన్నటి రాత్రి కూడా భీమేష్ ఫుల్ గా తాగొచ్చి ఇంట్లో గొడవకు దిగాడు. ఇక ఇదే అదునుగా భావించిన తమ్ముడు వెనుక నుంచి కర్రతో అన్నాను కొట్టి కిందపడేలా చేశాడు. ఇక తల్లి కత్తి తీసుకొని కొడుకును అతి కిరాతకంగా నరికి చంపింది. ఎవరికి తెలియకుండా ఒక మూటలో శవాన్ని కట్టి ఊరికి దూరంగా పడేయడానికి తల్లీ కొడుకులు బయలుదేరగా స్థానికులు మూటను చూసి వారిని ఆపి అడిగారు. ఇక వారికి అనుమానం రావడంతో మూట, బైక్ అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా భీమేష్ శవం కనిపించింది. ఇక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తల్లీకొడుకులు భీమేష్ ను తామే చంపామని ఒప్పుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.