Crime స్మగ్లింగ్ ను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న ప్రయోజనం లేకుండా పోతుంది.. ముఖ్యంగా విమానాశ్రయాల్లో ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. కోట్ల విలువైన వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు స్మగ్లింగ్ చేసేవాళ్లు ఎన్నో విధాలుగా కష్టం అధికారులను మస్కా కొట్టించాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ ఆటలన్నీ కట్టిపడేస్తున్నారు.. తాజాగా 27 కోట్ల రూపాయల విలువైన ఒక వాచ్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..
స్మగ్లింగ్ ను ఆపడం ఎవరి తరం కావడం లేదు.. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి నుంచి 27 కోట్ల రూపాయల విలువైన వాచ్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ వాచ్ తో పాటు ఎన్నో విలువైన వస్తువలను కూడా కస్టమ్స్ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు.. డైమండ్లు పొదిగిన గోల్డ్ బ్రాస్లెట్తో పాటు ఐఫోన్ 14 ప్రొ 256జీబీ స్మార్ట్ఫోన్ సహా ఇతర వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..
అయితే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించగా.. అత్యంత ఖరీదైన ఏడు రిస్ట్ వాచ్లు లభించాయి. జాకబ్ వాచ్ విలువ రూ.27 కోట్లు ఉండగా.. మిగిలిన వాటిలో ఐదు రోలెక్స్, ఒక పియాజెట్ వాచ్ ఉన్నాయి. మొత్తం ఏడు వాచ్ల విలువ 28.17 కోట్ల రూపాయలుగా లెక్కగట్టిన కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఎయిర్ పోర్టులో పట్టుబడిన స్మగ్లర్ ఈ ఏడు వాచ్లను గుజరాత్కు చెందిన ఓ వీవీఐపీ క్లయింట్కి చేరవేసేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ ఎయిర్పోర్టులోనే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా.. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో డైమండ్ వాచ్లతో పట్టుబడ్డాడు. దీంతో అసలు విషయం బయటికొచ్చింది.
The seized watches belong to international premium luxury brands including Jacob & Co and Rolex pic.twitter.com/Cjz1raonhR
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) October 6, 2022