Crime గతవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన టాటా సెన్స్ మాజీ చైర్మన్ ప్రాథిమిక పోస్ట్మార్టం పూర్తియింది. దీనిలో ఆయన తలకు, గుండెకు బలమైన గాయాలు అవ్వడంతో అక్కడే ఆయన మరణించారని నివేదికలో తెలుస్తుంది. అయితే ఆయన శరీరం నుండి ఎనిమిది శాంపిల్ను సేకరించిన పోస్టుమార్టం నివేదిక వాళ్ళు ఆయన చనిపోయిన చోటుకు పంపారు.
సోమవారం తెల్లవారుజామున ముంబై ప్రభుత్వము ఆధ్వర్యంలో ఇదే ఆసుపత్రిలో సైరస్ మిస్టరీ తో పాటు చనిపోయిన ఆయన స్నేహితుడు జహంగీర్ పోస్ట్ మార్టం కూడా జరిగింది అనంతరం ఈ శాంపిల్స్ ను ఆయన చనిపోయిన చోట అయినా కాసా పోలీస్ స్టేషన్ పరిధికి పంపించారు.. కాగా మరికొద్ది రోజుల్లో పూర్తి నివేదిక రానుంది. మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మితిమీరిన వేగం మిస్త్రీ , మిస్టర్ జహంగీర్ పండోల్ ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించకపోవడమే విషాదానికి దారి తీసిందని పోలీసులుఅధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పాల్ఘర్ దగ్గర రోడ్డు సరిగ్గా లేకపోయినప్పటికి చాలా స్పీడ్గా కారును డ్రైవ్ చేశాడు డ్రైవర్. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నారు. సైరస్ తో పాటు స్నేహితుడు జహంగీర్ పండోలే మరణించారు.. .సూర్య నదిపై ఉన్న వంతెనపై మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదానికి గురైంది. ఈప్రమాదంలో మిస్త్రీతోపాటు, స్నేహితుడు జహంగీర్ పండోలే మరణించారు.