Movie ప్రస్తుతం టాలీవుడ్ లో అంతా స్పెషల్స్ షోల ట్రెండ్ నడుస్తుంది.. మొన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు పోకిరి సినిమాలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా తమ్ముడు చిత్రాలు స్పెషల్ షో వేశారు అయితే ఇదే బాటలో తమిళ హీరోలు కూడా వెళ్తున్నారు తాజాగా ధనుష్ శృతిహాసన్ జంటగా నటించిన త్రీ మూవీ ని రిలీజ్ అయింది..
దాదాపు పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో చతికల పడింది. అయితే గురువారం ఈ చిత్ర నిర్మాత నట్టి కుమార్ బర్త్ డే కావడంతో 3 మూవీని రిలీజ్ చేశారు.. ఈ సినిమాలో వై దిస్ కొలవరి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో సినిమా మాత్రం అంతగా అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సినిమాకు ధనుష్ భార్య ఐశ్వర్య నిర్మాతగా వ్యవహరించారు అయితే ఈ సినిమా వలన తమకు నష్టం వచ్చిందని ఆ నష్టపరిహారం ఐశ్వర్య ధనుష్ ఇవ్వాలని అప్పట్లో డిస్క్రిబ్యూటర్లు డిమాండ్ చేశారు అయితే ప్రస్తుతం ఈ సినిమాను థియేటర్లో స్పెషల్ షో వేయగా ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు అన్ని థియేటర్లో షో నిండిపోయాయి. 300 లకు పైగా షోలు వేస్తే.. దాదాపు అన్నీ హౌస్ ఫుల్ అయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
నిజానికి ‘3’ ప్లాప్ అయినా సినిమాలో పాటలు మాత్రం విశేషంగా ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన ఈ సాంగ్స్ ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. అయితే ఇందులో ధనుష్ , శృతి హాసన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ యూత్ ని బాగా ఆకర్షిస్తాయి. ఈ కారణాలతో సినిమా రీ రిలీజ్ కు అంత క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. ఈ సినిమాకు ప్రస్తుతం వచ్చిన స్పందన చూసి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశారు. “వండర్ ఆఫ్ వండర్స్.. ‘3’ రీ రిలీజ్ గ్రాండ్ ఓపెనింగ్ రాబట్టింది.