Crime ఆ తల్లి తండ్రి తన కళ్ళని కలలుగానే మిగిలిపోయాయి.. విద్యుదాఘాతంతో రెండు కాళ్లు కోల్పోయి.. 14 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శిత్ చివరికి మృత్యుఒడికి చేరాడు.
14 రోజులుగా మృత్యులతో పోరాడుతున్న మా చిన్నారి బతుకుతాడని అందరూ అనుకున్నారు ఇంత ప్రమాదం జరిగిన తమ కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఎంతో ఆశగా నిరాశ మిగిలింది.. ఇన్ని రోజులు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి ఇక ఆ బాధను భరించలేక శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు..
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి దర్శిత్ ఈరోజు సాయంత్రం మృతి చెందాడు. ఈ నెల 12న తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో దర్శిత్ ఇంటిపై ఆడుకుంటూ 33కేవీ విద్యుత్తు లైన్ కారణంగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అదేరోజు కాకినాడ జీజీహెచ్కు తరలించారు. బాలుడి రెండు కాళ్లకు తీవ్రగాయాలై ఇన్ఫెక్షన్ సోకడంతో మోకాలి కింది వరకు తొలగించారు. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో కుడికాలులో మరికొంతభాగం (మోకాలుపై వరకు) నేడు శస్త్రచికిత్స చేసి తొలగించారు. తర్వాత వార్డుకు తరలించిన కొద్దిసేపటికే గుండె కొట్టుకుపోవడం నెమ్మదించి మృతిచెందాడని వైద్యులు తెలిపారు. 14రోజులు మృత్యువులో పోరాడి బాలుడు శుక్రవారం మృతి చెందడంతో పైడిమెట్ట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే బాలుడు మరణంతో కృంగిపోయిన ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని వాపోయారు