Movie తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వం 1 మూవీ విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు దర్శక, నిర్మాతలు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ విషయం చర్చనీయంశం అంశంగా మారింది.
పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మణిరత్నం ఎన్నో ఆశలతో తెరకెక్కిస్తున్నారు. దాదాపు నాలుగున్నర ఏళ్ల తర్వాత మణిరత్నం నుంచి ఓ సినిమా రాబోతుంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఈయన ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు షూటింగ్ పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందని.. అంతసేపు ప్రేక్షకులు థియేటర్లో కూర్చోగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన మణిరత్నం సరైన వివరణ ఇచ్చారు.
సినిమాలో సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎంతసేపైనా థియేటర్లో కూర్చుంటారని చెప్పుకొచ్చారు. మూడు గంటలు సినిమా నిడివి పెద్ద ఎక్కువ కాదని.. ఇప్పటికే ఇలాంటి సినిమాలు చాలా మంచి హిట్ అయ్యాయని అన్నారు.. ఇలాంటి సినిమాలకి కచ్చితంగా తగినంత నిడివి కావాలని అప్పుడే సినిమాలో ఉన్న విషయాన్ని పూర్తిగా ప్రేక్షకులకు అర్థమైనట్టు వివరించగలమని చెప్పుకొచ్చారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. ఇప్పటికే జోధా అక్బర్, మహానటి, అర్జున్ రెడ్డి, బాహుబలి,KGF, RRR, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు నిడివి ఎక్కువ ఉన్నా సినిమా సూపర్ హిట్ అవ్వచ్చు అని నిరూపించాయి.