Health ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాయామం చేయాలనో.. లేకపోతే ఆసక్తికొలదో రన్నింగ్ ను ఎంచుకుంటున్నారు.. అయితే ఈ రన్నింగ్ విషయంలో ఎన్ని లాభాలు ఉన్నాయో సరైన విధానాన్ని అనుసరించకపోతే అంతే నష్టం కూడా కలుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిరోజు దినచర్యలో రన్నింగ్ ను భాగం చేసుకోవడం వల్ల రోజంతా చురుకుగా ఉండవచ్చు.. ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయడానికి రన్నింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది.. అయితే పరిగెత్తి వచ్చాక కొన్ని పనులు చేయకూడదు.. అవేంటో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి..
చాలామంది పరిగెత్తి వచ్చిన తర్వాత దాహం వేస్తుందని నీరు తాగుతూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే పరిగెత్తే సమయంలో హార్ట్ బీట్ పెరుగుతుంది. ఒక్కసారిగా నీరు తీసుకోవడం వల్ల శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది.. అంతేకాకుండా పరిగెత్తి వచ్చాక ఆకలి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి.. రన్నింగ్ అయ్యాక 20 నుంచి 30 నిమిషాల తర్వాత మాత్రమే నీరు కానీ ఆహార పదార్థాలు గాని తీసుకోవాలి.. పరిగెత్తి వచ్చిన తర్వాత ఆ రన్నింగ్ బట్టలతో, చెమటతో ఎక్కువ సేపు ఉండకూడదు . ఇందులో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, అందుకే వీలైనంత తొందరగా ఆ బట్టల్ని మార్చుకోవాలి అలాగే అని రన్నింగ్ చేసిన వెంటనే స్నానం కూడా చేయరాదు..