సైబరాబాద్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని సిటిసిలో ఈరోజు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. సైబరాబాద్ సిటిసి ప్రిన్సిపల్ డిసిపి శ్రీమతి లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.
పోలీస్ వారోత్సవాల్లో భాగంగా ఆర్ ఎస్ ఐ/ ఏఎస్ఐ, క్రింది స్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు “What should the police do to earn respect and goodwill from the citizens” అనే అంశం పై వ్యాస రచనా నిర్వహించి బహుమతులను అందజేస్తారు.
అలాగే పోలీస్ వారోత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఐ/ ఎస్ఐ, పైస్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు “Role of Women Police effective policing” అనే అంశం పై వ్యాస రచనా నిర్వహించి బహుమతులను అందజేస్తారు.
ఈ పోటీల్లో గెలుపొందిన వారికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., మెమెంటోలు, బహుమతులను అందజేసీ అభినందించారు.