HIT- 2 తో డబుల్ హ్యాట్రిక్ హిట్ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్ గా గూఢచారి సీక్వెల్ అయిన G2 ని ఇటివలే అనౌన్స్ చేశారు. గూఢచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు నిర్వహించిన జి 2 ప్రెస్ మీట్ లో “ప్రీ విజన్” లాంచ్ చేశారు మేకర్స్. ప్రీ-విజన్ వీడియోలో శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో శేష్ ఫస్ట్ లుక్ ని ప్రజంట్ చేశారు.
ప్రెస్ మీట్ లో అడివి శేష్ మాట్లాడుతూ.. జి2 ని ఒక ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే తపన వుంది. కొత్త దర్శకుడు వినయ్ కి చాలా గ్రేట్ విజన్ వుంది. తనకి గూఢచారి వరల్డ్ పై చాలా మంచి పట్టువుంది. మా నిర్మాతలు విశ్వప్రసాద్, అనిల్, అభిషేక్ గారికి కృతజ్ఞతలు. నేను ఏదడిగినా సమకూరుస్తారు. గూఢచారి సౌత్ ఇండియా స్పై సినిమాల ట్రెండ్ మళ్ళీ తీసుకొచ్చింది. జి 2 తో ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ గా మారబోతుంది.
జి2 నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. సిక్స్ ప్యాక్ చేసి షూటింగ్ మొదలుపెడతాం(నవ్వుతూ). జి2 కి శ్రీచరణ్ మ్యూజిక్ అందిస్తారు. ఈ చిత్రాన్ని ఐదు దేశాల్లో షూట్ చేయబోతున్నాం. జి 2 ఏ స్థాయిలో వుంటుందో ప్రేక్షకులకు చిన్న రుచి చూపించడానికి ప్రీవిజన్ ని లాంచ్ చేశాం. 2024లో జి2 రాక్ ది బాక్స్ ఆఫీస్’’ అన్నారు.