Crime మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో అత్యాచారం, హత్య కేసులో నిందితులని పోలుసులు అరెస్ట్ చేశారు. యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన శ్రీశైలం అనే యువకుడితో పాటు… అతడికి సహకరించిన సమీప బంధువు శివలపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలంలోని మానాజీపేటకు చెందిన బత్తిని శ్రీశైలం హైదరాబాద్లోని ఓ కాలేజీలో డిగ్రీ చదివాడు. చదువు మధ్యలోనే మానేసి…సొంతురిలో కోళ్ల ఫారం పెట్టుకున్నాడు. తను డిగ్రీ చేస్తున్నప్పుడు కాలేజీలో జూనియర్ యువతితో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న శ్రీశైలం… ఓ సారి మాట్లాడాలంటూ సెప్టెంబర్ 5న మహబూబ్నగర్ జిల్లా భూత్పూరుకు రావాలని ఆమెను కోరాడు. అతడి మాటలు నమ్మి వెళ్లిన యువతిని….తన కోళ్ల ఫారం దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా… ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయిన శ్రీశైలం ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం… ఆమె చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. ఈ విషయం బయటపడకుండా సమీప బంధువు శివ సహకారంతో మృతదేహాన్ని కేఎల్ఐ కాల్వ పక్కన పూడ్చిపెట్టాడు.
అదే రోజు… కాలేజీకి వెళ్లిన కూతురు సాయంత్రం అయినా బయటకు రాకపోవడంతో.. మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు శ్రీశైలం అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు తెలిపడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా… అత్యాచారం చేసి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. దాంతో.. నిందితుడు శ్రీశైలంతో పాటు అతడికి సహకరించిన శివను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.