Crime అమ్మాయిల కోసం ఎన్ని చట్టాలు వస్తున్న వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న కాలనాగు కాటేసినట్టు ఏదో ఒక రకంగా అబ్బాయిలు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు ఎంత స్నేహితులని నమ్మిన ఒక్కోసారి మోసపోక తప్పదు అని తెలుస్తుంది ఇలాంటి షాకింగ్ సంఘటన తాజాగా చోటు చేసుకుంది..
తన ఫ్రెండే కదా అని నమ్మవెళ్లిన ఒక అమ్మాయిని మోసం చేసి ఆమెపై అఘాయిత్యం చేశాడు యువకుడు అంతేకాకుండా తొమ్మిది రోజులపాటు ఆమెను నిర్బంధించాడు వివరాల్లోకి వెళితే లుధియానాలోని హతుర్కు చెందిన జస్పాల్ సింగ్ కు బాధిత యువతి చాలా కాలంగా తెలుసు వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు.. అయితే తాజాగా తాను దుబాయ్ ట్రిప్పు వెళ్తున్నానని ఇందుకోసం షాపింగ్ చేయడానికి సహాయం కావాలని సెప్టెంబర్ 30వ తేదీన రాయికోట్కు రావాలని యువతిని కోరాడు. దాంతో స్నేహితుడే కదా అని నమ్మి అతడు చెప్పినట్టే రాయికోటుకు వెళ్ళింది యువతీ..
అక్కడికి వెళ్లిన యువతకి మత్తు మందు ఇచ్చిన ఆహారాన్ని ఆమెతో తినిపించాడు. దాంతో యువతి అపస్మారకస్థితికి చేరుంది. ఆ తర్వాత మరో ఇద్దరు స్నేహితులతో కలిసి యువతిని ఉత్తరప్రదేశ్లోని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి 9 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే అక్టోబర్ 8వ తారీఖున మా యువతికి స్పృహరావడంతో అక్కడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది అయితే ఆరోజు కూడా తనని వదలకుండా తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది.. ఎవరికి అక్కడి నుంచి తప్పించుకో వచ్చిన యువతి తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపిస్తున్నారు…