అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి చక్రవర్తి, ఫైజల్ ఖాన్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ సమీర్ దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్లో జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… ‘‘సినిమా వేదికలకూ నాకు చాలా దూరం. ఇప్పటి దాకా నేనొక పది సినిమాలు చూసుంటాను అంతే! అందులో ఒకటి అర్జున్ నటించిన సినిమా. మరొకటి ఆర్జీవీ చూడమంటే ‘కొండ’ సినిమా మా దోస్త్లతో కలిసి చూశా. సినిమా విషయంలో నా అంత అజ్ఞాని లేడు. ఎంతో కొంత సినిమా గురించి తెలుసుకోవాలనీ, ఆత్మీయులు పిలిచారని ఈ వేడుకకు వచ్చా. ఓ సందర్భంలో గబ్బర్సింగ్ అంత్యాక్షరి టీమ్ కాల్ చేస్తే చెప్పండి హీరోస్ అన్నాను. అన్నా మేం హీరోలేంటి అన్నారు. విలన్ లేనిదే హీరో ఎక్కడ ఉంటాడబ్బా అన్నాను.
ఈ సినిమా ట్రైలర్ చూశా. ఆసక్తికరంగా ఉంది. నా దగ్గరికి సినిమాలకు సంబందించిన సమస్యలు ఉంటాయి. సినిమా అనేది చూడటానికి వినోదమే కానీ తెర వెనుక, ఓ సినిమా తీసి దానిని విడుదల చేయడానికి చాలా కష్టపడాలి. మేం కూడ ఈ మధ్యన మా న్యూస్ కార్యక్రమాలను సినిమాటిక్గానే చేస్తున్నాం. నన్ను చాలామంది సినిమాల్లో నటించమని అడిగారు. నాకు సెట్ కాదని వెళ్లలేదు. మనమున్న వ్యవస్థకు సందేశాత్మక చిత్రాలు రావాలి. ఆ దిశగా ఆలోచన చేయాలి’’ అని అన్నారు.
అశోక్కుమార్, కరాటే లక్ష్మీ తదితరులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
నటీనటులు : సోనీ చరిష్టా, కెవిశ్వనాధ్, అశోక్కుమార్, శిల్ప, రామ్జగన్, దుబాయ్ రఫీక్, సంధ్యాజనక్
సాంకేతిక నిపుణులు :
ఫొటోగ్రఫీ: ఆమీర్ అలీ
ఆర్ట్: రఘు కులకర్ణి
సంగీతం: సుభాష్ ఆనంద్
యాక్షన్ డైరెక్టర్: కాళీ కికాస్
ఎడిటింగ్: ప్రభు
కొరియోగ్రఫి: అమ్మా రాజశేఖర్
పీఆర్వో మధు విఆర్