Crime ఆస్తి కోసం అయిన వారిని సైతం చంపుతున్న ఘటనలు ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం… కానీ… మహారాష్ట్రలోని పుణేలో మాత్రం అత్యంత కిరాతకమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. పుణెలోని కేశవ్నగర్లో నివాసం ఉండే.. ఉషా విఠల్ గైక్వాడ్ అనే 64 ఏళ్ల వృద్ధురాలు… దేహురోడ్లోని ఆర్మీ క్యాంప్లో పని చేసి పదవీ విరమణ పొందింది. ఆ తర్వాత ఆమె కేశవనగర్లో స్థిరపడ్డారు. ఈమెతో పాటే కొడుకు సందీప్ గైక్వాడ్, కోడలు ఉంటున్నారు. చాన్నాళ్లుగా అత్తాకోడళ్ల మధ్య తరచూ ఏదో ఓ విషయంలో వాగ్వాదాలు కరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 5న మరోసారి గొడవ జరిగగా…. కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దాంతో.. ఆగ్రహించిన విఠల్ గైక్వాడ్ మనుమడు సాహిల్… అదే రోజు మధ్యాహ్నం ఉషా విఠల్ నిద్రపోతూ స్నానాల గదిలోకి లాక్కెళ్లి గొంతు నులిమి హతమార్చాడు.
నానమ్మ అని కూడా చూడకుండా సాహిల్ చేసిన పనికి అతని తండ్రి సైతం సమర్థించాడు. హాత్య తర్వాత వృద్ధురాలి శరీరాన్ని మాయం చేసేందుకు కిరాతమైన పథకం వేశారు. చెట్లను కేసే ఎలక్ట్రిక్ కటర్తో వృద్ధురాలి మృతదేహాన్ని 9 ముక్కలుగా కత్తిరించి సంచుల్లో కుక్కారు కసాయి… తండ్రి కొడుకులు. ఆ బ్యాగులను కారులో తీసుకువెళ్లి ముథా నది నీటిలో పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగు వదిలేసి…. రక్తంతో తడిసిన కత్తి, దుస్తులను నది ఒడ్డున పారేశారు.
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు… వృద్ధురాలి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 10న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఉష కుమార్తెకు…. తన అన్న మీద అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా…. ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు… అసలు నిజాన్ని రాబట్టారు. వృద్ధురాలి కుమారుడు, మనవడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. ఇద్దరినీ రిమాండుకు తరలించారు. నానమ్మ ఆస్తిపై కన్నేసి ఈ హత్య చేసినట్లు అంగీకరించిన సాహిల్ ఓ మలయాళ రీమేక్ సినిమా చూశాకే తనకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పడం… పలురిని ఆశ్చర్యానికి గురిచేసింది.