Health భారత్లో రానురాను మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుంది. ఇలా జరగడానికి ప్రజల జీవనశైలిలో మార్పులు, తప్పుడు ఆహారపు అలవాట్లు సహా… కొన్ని చెడు అలవాట్లే కారణమంటున్నారు వైద్యులు. ప్రస్తుతం దేశంలో సుమారు ఏడున్నార కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అయితే… టైప్ 1 మధుమేహం కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చే జన్యుపరమైంది కాగా.… టైప్ 2 డయాబెటిస్ మత్రం మన తప్పుల ఫలితంగానే వస్తుంది. అందుకే… ఈ రకం డయాబెటిస్కు దూరంగా ఉండాలనుకుంటే కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే. లేదంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవంటున్నారు… వైద్య నిపుణులు.
ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం.. కొవిడ్ లాక్డౌన్ కాలం నుంచి ప్రజలు ఎక్కువగా కూర్చోవడమే, పడుకుంటూనో కాలం గడిపేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు, వెబ్ సిరీస్లను ఆస్వాదిస్తూ గంటల కొద్ది అలానే ఉండిపోతున్నారు. ఇలా చేయడం ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం లేదా పడుకోవడంతో శారీరక శ్రమ టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అధిక కేలరీల ఆహారం.. ఒక వ్యక్తి రోజు వారీగా అతను చేసే పని, ఖర్చు చేసే కాలరీల ఆధారంగానే అతని ఆహారం ఉండాలి. కాదని… వ్యాయామం చేయకపోవడం.. మద్యపానం, ధూమపానం.. పోషకాహార లోపం.. స్థూలకాయం.. ఇష్టారాజ్యంగా కొవ్వు, అధిక కాలరీల ఆహారం తీసుకుంటే… టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది.