Health News:అసలే వర్షాకాలం విష జ్వరాలు జలుబు దగ్గు వంటి సమస్యలే అధికంగా ఉన్నాయంటే వీటికి తోడు మధుమేహం బీపీ వంటి సమస్యలు మనుషులను మరింత బాధిస్తున్న విషయం తెలిసిందే. తీసుకుంటున్న ఆహారం ఏమో కానీ కొన్ని సర్వేల ప్రకారం కుటుంబంలో ఒక్కరైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో స్పష్టంగా తెలిసిందే. ఆరోగ్యంవంతమైన జీవితాన్ని పొందాలనుకుంటే మనం తీసుకునే ఆహారంలో ఈ నియమాలైనా తూచా తప్పకుండా పాటించాలని ఆరోగ్యానికి నిపుణులు సూచిస్తున్నారు.
ఆపిల్:
రోజుకి ఒక ఆపిల్ తీసుకోవడం ద్వారా మతిమరపుకి కారణమయ్యే అల్జీమర్స్ వ్యాధిని నివారించుకోవచ్చు అలానే మెదడు చురుగ్గా పనిచేయడంలో ఆపిల్ ఎంతగానో సహాయం చేస్తుంది.
జామకాయ: జామకాయల సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది అలానే నోటి సమస్యలు పడుతున్నవారు జామకాయలను అధికంగా తీసుకోవడం ద్వారా మంచి ఉపశమనం పొందుతారు.
అరటిపండు: మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారు అరటి పండును అధికంగా తీసుకోవడం వలన ఆ సమస్య నుంచి విముక్తి పొందుతారు. అరటి పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థకు జీర్ణ వ్యవస్థ పని తీరుకు చక్కగా పనిచేస్తుంది.
ఆకుకూరలు: మనం తీసుకునే ఆహారంలో వారానికి మూడుసార్లు అయినా ఆకుకూరలు తీసుకోవాలి ఆకుకూరలో ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి. అలానే అధిక బరువుతో బాధపడేవారు ఉడకపెట్టి పెట్టిన ఆకుకూరలను తీసుకోవడం ద్వారా అధిక బరువు నుండి ఉపశమనం పొందుతారు. ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది కేవలం ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి మాత్రమే.