‘రఘువరన్ బి.టెక్’లో ధనుష్ తమ్ముడిగా నటించిన రిషికేశ్ ఇప్పుడు ‘బొమ్మల కొలువు’ చిత్రంతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఎ.వి.ఆర్.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మల కొలువు’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలతేదీని తెలియజేసేందుకు సోమవారంనాడు రామానాయుడు స్టూడియోలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
చిత్ర దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ… నా దర్శకుల టీమ్ మంచి సహకారం అందించారు. ప్రవీణ్ చక్కటి బిజి.ఎం. ఇచ్చి సంగీతంతో సినిమా మరో స్థాయిలో తీసుకెల్లేలా దోహదపడ్డాడు. ఎడిటర్ వర్మ పనితీరు బాగుంది. నిర్మాత స్వామిగారు నాపై నమ్మకంతో రెండో సినిమా చేశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకముందని తెలిపారు.