Health ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధించ సమస్య చుండ్రు బయట కాలుష్యంలో తిరగటం వల్ల ప్రతి ఒక్కరికి చుండ్రు సమస్య ఎక్కువగా భావిస్తుంది అయితే చిన్న చిన్న చిట్కాలను పాటించి ఈ సమస్యను దూరం చేసుకోవచ్చ అంటున్నారు నిపుణులు..
కాలుష్యం లో ఎక్కువగా తిరగటం వల్ల తలస్నానం చేసిన వెంటనే జుట్టును సరిగ్గా ఆరబెట్టుకోకపోవడం వల్ల చుండ్రు సమస్య ఎక్కువవుతుంది అయితే ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు ఊడిపోతుంది కొందరు ఎంత ప్రయత్నించినా ఈ సమస్యను దూరం చేసుకోలేరు.. అయితే ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు..
చుండ్రు సమస్యను దూరం చేయటంలో పెరుగు మంచి పాత్రను పోషిస్తుంది.. మెంతులను రాత్రంతా నానబెట్టి రోజు ఉదయం మెత్తగా రుబ్బి వాటిలో పెరుగు కలిపి తలకు పట్టించాలి ఇలా అరగంట ఉంచిన తర్వాత తలస్నానం చేసేయాలి అలాగే పెరుగులో సగం చెంచా నిమ్మరసం కలిపి తలకు పట్టించిన మంచి ఫలితం ఉంటుంది అలాగే కలబంద గుజ్జు సహజంగా చుండ్రును దూరం చేయటానికి సహాయపడుతుంది కలబంద గుజ్జులో కొంత పసుపు కలిపి తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేసేయాలి.. అలాగే బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తలకు స్కార్ఫ్ కట్టుకోవాలి జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలి వీటిని పాటిస్తూ ఉంటే క్రమంగా చుండ్రు సమస్య దూరం అయిపోతుంది..