Crime News: నిద్రపోతున్న భార్యను లేపు మరి ట్రైన్ కిందకు తోసాడు మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయ్ రైల్వే స్టేషన్ లో జరిగింది.ఈ ఆదివారం మధ్యాహ్నం నుంచి నిందితుడు కుటుంబం వసాయ్ రైల్వే స్టేషన్ సోమవారం వేకువ జావ వరకు వరకు ఉండటం జరిగింది. సోమవారం ఉదయం నిద్రపోతున్న తన భార్యను లేపి ఆమెతో మాట్లాడుతూ అటువైపు వస్తున్న అవధ్ ఎక్స్ప్రెస్ కిందకు ఆమెను గట్టిగా తోసేశాడు నిందితుడు. తోసిన వెంటనే ఆమె అక్కడికక్కడ మృతి చెందారు. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలు తీసుకొని పరారయ్యాడు.
అయితే ఈ సంఘటన ఆ రైల్వే స్టేషన్ కెమెరా లో రికార్డు అయింది. వెంటనే రైల్వే పోలీస్ దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకోడానికి పోలీస్ బృందం వెతకడం మొదలు పెట్టింది.నిందితుడు వసాయ్ నుంచి దాదర్, తర్వాత కల్యాణ్కు వెళ్లాడు. చివరకు భీవండిలో పోలీసులకు చిక్కాడు.
కాగా పోలీసులు నిందితుని విచారించగా కుటుంబాల కలహాల వల్ల ఇద్దరి మధ్య వాదనలు పెరిగాయని ఆ నిందితుడు చెప్పడం జరిగింది.. ఆ కోపంలో పెట్టేసానని ట్రైన్ కిందికి తోసేసాను అని నిందితుడు అంగీకరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బృందం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద వసాయ్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.. మరణించిన ఆమె శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. మరియు కుటుంబ సభ్యులకు ఆ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగినది.