Crime మావోయిస్టు పార్టీ రాష్ట్ర నేత దామోదర్ భార్య, చర్ల ఏరియా కమిటీ మెంబర్ మడకం రజితను అదుపులోకి తీసుకున్న విషయంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. కీలక సభ్యురాలితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని ఎన్కౌంటర్ చేసే అవకాశాలున్నాయంటూ మావోయిస్ట్ పార్టీ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో వారి అరెస్ట్ను అధికారికంగా ధృవీకరిస్తూ…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రకటన విడుదల చేశారు.
పోలీసులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్తో వచ్చిన ఇద్దరు మహిళా మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర నేత దామోదర్ భార్య, చర్ల ఏరియా కమిటీ మెంబర్ మడకం రజిత ఉన్నట్లు తెలిపారు. ఆమెతో పాటు దళ సభ్యురాలు మడవి ధని కూడా ఉన్నట్లు వెల్లడించారు.ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు.
సెప్టెంబర్ 7న కుర్నపల్లి–బోదనెపల్లి మధ్య అటవీ ప్రాంతాల్లో చర్ల, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వీరు పట్టుబడినట్లు తెలిపారు. తెలిపారు. రజిత స్వగ్రామం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం ములకనాపల్లి కాగా, ధనిది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో ఆమె 81 ఘటనల్లో తన ప్రమేయం ఉందని అంగీకరించినట్లు… ఎస్పీ తెలిపారు. కాగా… పోలీసుల కూబింగ్లో మావోలు పట్టుబడిన వెంటనే కీలక ప్రకటన జారీ చేసిన మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వం… మొత్తం ఆరుగురు మావోయిస్ట్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపించారు. కానీ.. ఎస్పీ మాత్రం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు చెబుతుండడంతో… మిగతా నలుగురు మావోల ఏమయ్యారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.