Movie News : లేడీ సూపర్ స్టార్ తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ హనీమూన్ లో ఫుల్ హుషారుగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట థాయ్లాండ్, స్పెయిన్ దేశాలలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియా వేదికైన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 9న ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు ఈ ప్రేమ జంట. వీరి వివాహం తర్వాత మహాబలిపురంలోని ఓ హోటల్ రిసార్ట్లో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిర్వహించిన రిసెప్షన్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినవి. అయితే తాజాగా ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది అది ఏమిటంటే. ఈ జంట హనీమూన్ కి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే…
ఈ ప్రేమ జంట హనీమూన్ ఖర్చు మొత్తం ఓ ప్రముఖ సంస్థ స్పాన్సర్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.వీరి ఒక్కరోజు హోటల్ రూమ్ అద్దె రూ. 2.5 లక్షలట. ఇంకా నయన్ సినీ విశేషాలు గురించి వివరిస్తే నయనతార పెళ్లి తర్వాత ప్రాజెక్ట్ కంటెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారట.లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు, పాత్ర ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది అనే సమాచారం చిత్ర పరిశ్రమలో చక్కెరలు కొడుతుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తెలుగులో కూడా కొత్త ప్రాజెక్టులు వింటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇంకా ఈ ప్రేమ జంట పెళ్లి డాక్యుమెంటరీని నయనతార విఘ్నేష్ శివన్ బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో ప్రసారం చేయనున్నారు. అయితే వీరి ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేసింది నెట్ ఫ్లిక్స్.