(ISDE) India Edition 2026 : భారతదేశంలో మొట్టమొదటిసారిగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు 2026 ఏప్రిల్ 10 నుండి 11 వరకు హైదరాబాద్లోని ది వెస్టిన్ హోటల్, హైటెక్ సిటీ లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ డిసీజెస్ ఆఫ్ ది ఈసోఫాగస్ (అన్నవాహిక) (ISDE) ఇండియా ఎడిషన్ 2026ను నిర్వహిస్తోంది.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (BIACH&RI), హైదరాబాద్ వారు 10–11 ఏప్రిల్ 2026 తేదీలలో ది వెస్టిన్, హైటెక్ సిటీ, హైదరాబాదులో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ డిసీజెస్ ఆఫ్ ది ఈసోఫాగస్ (అన్నవాహిక) (ISDE) ఇండియా ఎడిషన్ 2026 కు ఆతిథ్యం ఇవ్వడాన్ని గర్వంగా భావిస్తోంది. ISDE సదస్సు భారతదేశంలో జరగడం ఇదే మొదటిసారి. ఈ సదస్సు నిర్వహణ దేశంలోని ఆంకాలజీ సమాజానికి మరియు క్యాన్సర్ సంరక్షణలో విశ్వసనీయ సంస్థ అయిన BIACH&RIకి ఒక మైలురాయి వంటి క్షణం.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు యొక్క శాస్త్రీయ కార్యక్రమంలో ఏడు దేశాలకు చెందిన అంతర్జాతీయ అధ్యాపకులతో పాటు ప్రముఖ భారతీయ నిపుణులు పాల్గొని అన్నవాహిక క్యాన్సర్ చికిత్స మరియు పరిశోధనలో అత్యాధునిక పురోగతులను వివరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ లొరెంజో ఫెర్రి (కెనడా), డాక్టర్ కెన్ కాటో (జపాన్), డాక్టర్ హిరోయుకి డైకో (జపాన్), డాక్టర్ ఎడ్వర్డ్ చెయోంగ్ (సింగపూర్), డాక్టర్ కువాంగ్ డుయోంగ్ (ఆస్ట్రేలియా), మరియు డాక్టర్ స్టీవెన్ లిన్ (యుఎస్ఎ) వంటి వైద్య నిపుణులు మరియు ప్రముఖులు పాల్గొంటారు. వీరితో పాటు BIACH&RI మెడికల్ డైరెక్టర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ (ఐఎఎస్ఓ) అధ్యక్షుడు మరియు గ్లోబల్ ఫోరమ్ ఆఫ్ క్యాన్సర్ సర్జన్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయిన డాక్టర్ టి. సుబ్రమణ్యేశ్వర రావు, మరియు ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎస్. ప్రమేష్ వంటి నిపుణులైన భారతీయ వైద్యబృందం కూడా పాల్గొంటుంది.
ఇలా భారతదేశంలో మొట్ట మొదటి సారిగా హైదరాబాదులో నిర్వహించబడుతున్న ఈ సదస్సు BIACH&RI యొక్క రజతోత్సవంతో అంటే క్యాన్సర్ చికిత్స మరియు విద్యా రంగాలలో 25 ఏళ్ల అత్యుత్తమ ప్రస్థానం కలసి ఏకకాలంలో రావడం విశేషం. ఇది క్యాన్సర్ రోగుల పట్ల కరుణ మరియు ఆధునిక ఆవిష్కరణలకు ఒక విశ్వసనీయ కేంద్రంగా సంస్థ పోషిస్తున్న పాత్రను ప్రత్యేకంగా చాటిచెబుతోంది.
NBTRMCF ఛైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “వైద్యం అనేది కేవలం ఒక శాస్త్రం మాత్రమే కాదు — అది ఒక నిబద్ధత. ప్రపంచంలోని అత్యుత్తమ విజ్ఞానాన్ని మన ప్రజలకు అందించాలన్న మా నిబద్ధతకు ‘ISDE India Edition 2026’ నిదర్శనం,” అని పేర్కొన్నారు.
అనంతరం ఈ సందర్భంగా BIACH&RI వైద్య సంచాలకులు, IASO అధ్యక్షులు మరియు Global Forum of Cancer Surgeons అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న డాక్టర్ టి. సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ… “భారతదేశంలో ISDE సదస్సును నిర్వహించడం కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు — క్యాన్సర్పై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని చాటిచెప్పే ఒక ప్రకటన ఇది.” అని వివరించారు.
దీనికి మరింత జోడిస్తూ ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎస్. ప్రమేష్ మాట్లాడుతూ… “భారతదేశపు ఆంకాలజీ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఎలా అనుసంధానం అవుతుందో, మన రోగులు ఉత్తమమైన విజ్ఞానం మరియు సంరక్షణ నుండి ప్రయోజనం పొందేలా ఎలా నిర్ధారిస్తుందో ఈ సమావేశం తెలియజేస్తుంది” అని అన్నారు.
సదస్సులో భాగంగా ఏప్రిల్ 10వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు అంతర్జాతీయ అధ్యాపకులు మరియు నిర్వాహక బృందం కలసి ఒక ప్రత్యేక విలేకరుల సమావేశంలో మీడియాతో ముచ్చటిస్తారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు, ISDE నాయకత్వం, విశిష్ట అధ్యాపకులు మరియు చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ నేతృత్వంలోని BIACH&RI ట్రస్టు బోర్డు సభ్యుల సమక్షంలో ఈ సదస్సు లాంఛనంగా ప్రారంభించబడుతుంది.
అన్నవాహిక క్యాన్సర్పై ప్రపంచ పోరాటంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసే ఒక కీలకమైన ఘట్టం ఐఎస్డిఇ ఇండియా ఎడిషన్ 2026. ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని హైదరాబాద్కు తీసుకురావడం ద్వారా, ఈ సదస్సు భారతీయ రోగులు మరియు వైద్యులు తాజా శాస్త్రీయ పురోగతులు మరియు బహుళ విభాగాల విధానాల నుండి నేరుగా ప్రయోజనం పొందేలా నిర్ధారిస్తుంది.
























