అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర`. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత. మే 26న థియేటర్స్ లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
హీరో సన్నీ నవీన్ మాట్లాడుతూ… రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ఫ్యాక్షన్ తప్పకుండా ఉంటుంది, కానీ జైత్ర సినిమా అందుకు భిన్నంగా రాయలసీమలో నివసించే ఒక రైతు కుటుంబానికి చెందిన కథ కథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అలాగే సినిమాకు వచ్చిన మీకు మా సినిమా మరింత నచ్చుతుందని తెలిపారు.
నటీనటులు : సన్నీ నవీన్, రోహిణి రేచల్, వంశీ నెక్కంటి, సునీత మనోహర్ తదితరులు
కెమెరా: మోహన్ చారి
పాటలు : కిట్టు విస్సా ప్రగడ
సంగీతం : ఫణికళ్యాణ్
ఎడిటర్: విప్లవ్ నైషదం
దర్శకత్వం : తోట మల్లిఖార్జున్
నిర్మాత: అల్లం సుభాష్.
పిఆర్ఒ: శ్రీధర్