Crime జార్ఖండ్ హజారీబాగ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 40 మంది తీవ్రంగా గాయాలు పాలయ్యారు.. బస్సులో చిక్కుకుపోయిన మరికొందరిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..
ఈ ప్రమాదం ఝార్ఖండ్ లోని గిరిఢీ నుంచి హజారీబాగ్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ఝార్ఖండ్ తాతిఝరియా వద్ద ఉన్న శివానీ నదిపై ఈ ప్రమాదం జరిగింది.. ఈ నదిపై ఉన్న బ్రిడ్జి పైన బస్సు వెళుతున్న సమయంలో అదుపుతప్పి అందులో పడిపోయింది.. అయితే బస్సు వెళుతున్న సమయంలో బ్రిడ్జ్ కు ఉన్న రైలింగ్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం ప్రకారం బస్సు ప్రమాదానికి గురయ్యే సమయానికి అందులో 50 మంది కంటే ఎక్కువగా ప్రయాణికులు ఉన్నారని తెలుస్తుంది. అయితే వీరంతా ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్తున్నారని సమాచారం.
ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సహాయక చర్యలు మొదలైన అప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకు తీవ్ర గాయాలు పాలయ్యారు.. అయితే నదిలో ఎంతమంది కొట్టుకుపోయారో అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి..