Movie రణబీర్ కపూర్- ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మాస్త్ర మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదలైంది. అయితే ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది.. చూసిన ప్రేక్షకులు అభిమానులు ఒక్క విధంగా స్పందిస్తున్నారు అయితే ఈ సినిమాపై రీసెంట్ గా క్వీన్ కంగనా వ్యాఖ్యలు చేసింది.
ఏ విషయాన్ని అయినా ఎంతో ధైర్యంగా మాట్లాడి తరచు వార్తలు నిలుస్తుంది కంగనా రనౌత్. అలాగే బ్రహ్మాస్త్ర సినిమాపై స్పందించిన క్వీన్ కంగనా రనౌత్ ఈ సినిమా డిజాస్టర్ అవ్వటం ఖాయమని తేల్చి చెప్పేసింది. అంతేకాదు ఈ సినిమా వలన పీవీఆర్- ఐనాక్స్ సంస్థలకు దాదాపు 800 కోట్లు నష్టం తప్పదని అంటుంది. అంతేకాకుండా రణబీర్ కపూర్- ఆలియా భట్ ఉత్తమ నటులుగా ప్రచారం చేసుకుంటూ సినిమాను పబ్లిష్ చేసుకున్నారని అన్నారు.. తన జీవితంలో ఎప్పుడూ మంచి సినిమా చేయని దర్శకుడి కోసం రూ. 600 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసిన అయాన్ ముఖర్జీని మేధావి అని ఎలా పిలుస్తారు అని వ్యాఖ్యానించింది.
సినిమాలను గొప్పగా చిత్రీకరించడానికి మనదేశంలో ఒక్క అంతర్జాతీయ స్టూడియో కూడా సరిగ్గా లేదని అన్నారు.. సినిమాను మాఫియాగా మార్చి మొత్తం చేతుల్లోకి తీసుకున్న వీళ్ళందర్నీ సినిమాలు కు దూరం చేయాలని.. స్టూడియోలు లేనప్పుడు ఫైనాన్షియర్లు, నిర్మాతలు దొరకడం చాలా కష్టం అని.. ఇలా అయితే ముందు ముందు మనం సినిమాలు ఎలా తీయాలి? అని కూడా కంగన ప్రశ్నించింది.