తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారకరామారావు జన్మదినం ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఆధ్వర్యంలో రూపొందించిన “కదిలే కదిలే…” ప్రత్యేక గీతాన్ని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈరోజు ఆవిష్కరించారు.
ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక గీతాన్ని రూపొందించిన దూలం సత్యనారాయణ, సంగీత దర్శకుడు కార్తిక్ కొడకండ్ల, గీత రచయిత వీరు గడ్డం మరియు బృందాన్ని యంపి సంతోష్ కుమార్ అభినందించారు.