Crime ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరుపక్షాల సైనికులు నెలల తరబడి బాంబాలు, క్షిపణులతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోరాడుతున్నారు. ఈ సందర్భంలోనే ప్రపంచాన్ని దిగ్భాృంతికి గురిచేసే, భయానక దృశ్యం ఒకటి ఉక్రెయిన్లో వెలుగు చూసింది. ఉక్రెయిన్లోని అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టిన 44కి పైగా మృతదేహాలు బయటపడ్డాయి. దాంతో… ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
చానాళ్లుగా రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ పట్టణం ఖార్కీవ్.. తిరిగి ఉక్రెయిన్ సొంతమైంది. అక్కడి రష్యా సైనికుల్ని తరిమికొట్టిన ఆ దేశ సైన్యం… ఈ ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ ప్రాంతం చాలా వరకు యుద్ధంలో నాశనం కాగా… ఆ ప్రాంతాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అలా… ఇజియం శివారు అటవీ ప్రాంతంలో ఓ చోట అనుమానాస్పదంగా కనిపించిన గొయ్యిని తవ్విన అధికారులు షాక్కు వ్రయ్యారు. ఆ గొయ్యిలో ఏకంకా 440కి పైగా మృతదేహాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని తూర్పు ఖర్కివ్ ప్రాంతంలోని సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఇక్కడి మృతదేహాలని పరిశీలించగా… వారిలో కొందరు తుపాకీ గాయాలతో చనిపోగా… మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు వీరిలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయన్న అధికారులు… కొన్ని మృతదేహాలపై తీవ్రంఈ విషయంపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ… తమ దేశంలో రష్యా సృష్టించిన మారణహోమం గురించి ప్రపంచానికి ఈ సంఘటన తెలుపుతుందని వ్యాక్యానించారు. అసలు రష్యా ఆక్రమణ దేనికి దారితీసిందో ప్రపంచం తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా… ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో ప్రజల ప్రాణాలు ఏ తీరుగా పోతున్నాయో… ఈ ఒక్క సంఘటనతోనే తెలుస్తుందంటున్నారు… విశ్లేషకులు.గా హింసించి, చంపిన గుర్తులున్నట్టు తెలిపారు.