Movie ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్తో మంచి జోష్లో ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తర్వాత సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసేసాడు. దర్శకుడు త్రివిక్రమ్తో మూవీ చేస్తున్నట్లు తెలిసిందే. ఇటీవలే పూజాకార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా నేడు(సోమవారం) ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్మీడియా ద్వారా తెలిపింది. భారీ కెమెరాలతో హై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు తెలిపింది. సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్ కూడా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్కు సంబంధించిన కొత్త లుక్ను కూడా పోస్ట్ చేశారు.
అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయ్యాయి. మాటల మాంత్రికుడు తో మహేష్ చేయనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి.
అయితే ఓ పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ పాత్ర చాలా బాగుంటుందని.. మహేశ్ సరసన పూజాహెగ్డే సందడి చేయనునన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఇప్పటికే ‘మహర్షి’ కలిసి నటించారు.. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా కోసమే కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.