Crime ఈ మధ్యకాలంలో ఇంజక్షన్ల కలకలం ఎక్కువగానే కనిపిస్తుంది ఆ మధ్య ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తిని ఇంజక్షన్ ఇచ్చి చంపిన సంఘటన మరువకముందే తాజాగా అలాంటి ఓ సంఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది..
తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలంలో మత్తు ఇంజక్షన్ సంఘటన కలకలం రేపింది.. శ్రీకాంత్ అనే యువకుడు బస్టాండ్ లో నించొని బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు.. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కాసేపు పరిసరాలను చూస్తూ ఇటువంటి వచ్చాడారు ఇంతలా అదును చూసుకొని.. అతనికి వెనుక నుంచి మత్తయి ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యారు.. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు.. ఈ విషయాన్ని చూసిన చుట్టూ ఉన్న ప్రయాణికులంతా షాక్కు గురయ్యారు.. యువకుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు గమనించి వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా వారు వచ్చి ఆ యువకుడు ఆసుపత్రికి తరలించారు… ప్రస్తుతం ఆ యువకుడు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు..
ఈ విషయంపై ఆ గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది ఇప్పటికే ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఆయన వింటూ వస్తున్న ఆ గ్రామస్తులకు వాన పరిసరాల్లోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం మరింత భయాందోళనలకు గురిచేసింది.. గత నెలలో వివాహేతర సంబంధం పెట్టుకొని విషపు ఇంజక్షన్తో భర్తను హత్య చేయించిన మరువకముందే ఇలాంటి ఓ సంఘటన జరగటం అందర్నీ భయాందోళనలకు గురిచేస్తుంది..