Minister KTR Presented Accident insurence Checks to TRS Party Workers Family at Telangana Bhavan, CM KCR, Telangana News, Telugu World Now,
ప్రమాదాల్లో మరణించిన 80 మంది టీ ఆర్ ఎస్ కార్యకర్తల కుటుంబాల తో లంచ్ చేసి ,2 లక్షల రూపాయల చొప్పున పార్టీ నుంచి ప్రమాద బీమా చెక్కులు అంద జేసిన టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్@తెలంగాణ భవన్*
కేటీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు ..
* ప్రతి కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్దదిక్కులా ఉంటారు. ప్రమాదాల్లో మరణించిన కార్యకర్త ఇంటికి నేడు పెద్దదిక్కు లేకున్నా, పార్టీ- కేసీఆర్ అండగా ఉన్నారు. 60లక్షల సభ్యత్వం కలిగిన అజేయ శక్తిగా టీఆరెస్ పార్టీ ఎదిగింది. 60లక్షల మంది కుటుంబ సభ్యులు టీఆరెస్ పార్టీ కుటుంబమే. ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన పార్టీ కార్యకర్త కుటుంబం అధైర్యపడొద్దు. మరణించిన కుటుంబ సభ్యుల బాధ్యత టీఆరెస్ జనరల్ సెక్రెటరీస్ పై ఉంది.
* రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ సెక్రెటరీస్ ఇంచార్జ్ ప్రాంతాల్లో వారిదే బాధ్యత. 80 మంది కుటుంబ సభ్యుల సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తాం. గత సంవత్సరం 950 మంది టీ ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రమాదాల్లో మరణించారు …వారినీ ఆదుకుంటాం, పార్టి ని కాపాడుతున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, ఈ సారి పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా కోసం 18 కోట్ల రూపాయల చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీ కి ఈ రోజు అందజేస్తున్నాం
* మీ ఇంట్లో వాళ్ళు మీకు దూరం అయినా కేసీఆర్- టీఆరెస్ పార్టీ మీకు ఉంది. గుండె నిబ్బరం చేసుకోండి అధైర్య పడకండి …పార్టీ ఎల్లపుడూ మీకు అందు బాటు లో ఉంటుంది.