అఖండ వంటి బ్లాక్బస్టర్ తర్వాత నటిసింహా నందమూరి బాలకృష్ణ, క్రాక్ వంటి సక్సెస్ఫుల్ తర్వాత దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్లో బాలయ్య107వ సినిమాగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు సిరిసిల్ల టౌన్ (తెలంగాణ)లో ప్రారంభమైంది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్తో షూటింగ్ని మొదలుపెట్టారు మేకర్స్. బాలకృష్ణ – ఫైటర్స్పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు.
మాస్ హీరో మరియు మాస్ దర్శకుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో మంచి ట్రీట్ ఇవ్వనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్
సాంకేతిక బృందం: స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: గోపీచంద్ మలినేని, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం: తమన్ ఎస్, డీఓపీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్ : రామ్- లక్ష్మణ్, సీఈవో : చెర్రీ, కో డైరెక్టర్: కుర్రా రంగరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రహ్మణ్యం కేవీవీ, పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీఆర్వో : వంశీ-శేఖర్.