గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ వీరమాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా వీరసింహుని విజయోత్సవం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో బాలకృష్ణ చేతుల మీదగా చిత్ర యూనిట్ కు మెమెంటో ప్రధాన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
వీరసింహుని విజయోత్సవంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి స్వరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా తండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి శత జయంతి అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడు గోపీచంద్ మొదట వచ్చినపుడు చెన్నకేశవరెడ్డి గుర్తొస్తుందని చెప్పాను. తను అయోమయంలో పడ్డాడు. సీమరక్తం కదా కుతకుత లాడుతుందని అన్నాను. వెంటనే ‘చెన్నకేశవరెడ్డి’… అన్నాడు. ఒక అద్భుతమైన కథని రాశాడు. ఇది ఒక గొప్ప ప్రయాణం. ఈ ప్రయాణంలో అద్భుతమైన సినిమా చేశాం. తెలుగు ప్రేక్షకులతో పాటు సినిమా అభిమానులు ‘వీరసింహారెడ్డి’ అద్భుతంగా వుందని ప్రసంశించారు.
వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. తొడగొట్టి చెబుతున్నాను.. వీరసింహారెడ్డి లో సీమ వాసన కనిపించింది. రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. సాయి మాధవ్ బుర్రా పదునైన మాటలు రాశారు. ఇన్ని రకాల పాత్రలు చేశానంటే అది నా అదృష్టం. ఇంకా కుర్రాడిలా వుండటానికి నా రహస్యం అదే. సినిమా, నా హాస్పిటల్, హిందూపురం నియోజికవర్గం గురించి తప్పా నాకు మరో ఆలోచన లేదు. దునియా విజయ్, వరలక్ష్మీ గారు పోటాపోటీగా విలనిజం పండించారు. ఇలాంటి పాత్రలు చేయడం ఒక సాహసం. ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. వీరసింహారెడ్డి లో ఒక విస్పోటనం జరిగింది. నేపధ్య సంగీతంతో పాటు ఆణిముత్యాలు లాంటి పాటలకు మణిపూసలు లాంటి బాణీలు సమకూర్చారు తమన్. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అద్భుతమైన యాక్షన్ ని సమకూర్చారు.
డివోపీ రిషి పంజాబీ, విష్ణు, ప్రసాద్ .. అద్భుతంగా పని చేశారు. ఇందులో మూడు టైం జోన్స్ వున్నాయి. టర్కీలో కూడా అందంగా చిత్రీకరించారు. హానీ రోజ్ తన పాత్రలో నవరసాలు పండించారు. శ్రుతి హాసన్, నట విశ్వరూపం కమల్ హాసన్ గారి డిఎన్ఎ. తన పాత్ర మేరకు చాలా అద్భుతంగా నటించారు. లాల్ గారు ఎక్కడా మాట్లడకుండా అద్భుతమైన పాత్ర చేశారు. చివర్లో ఆ పాత్ర పేలింది. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు అభిమానులు నాపై చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామ రక్ష.
మీ అంతులేని అభిమానం, అనంతమైన ఆత్మీయత, ఎవరికీ దక్కని ప్రేమానురాగాలు చూపిస్తున్న మీకు..మీ బాలకృష్ణ మనసు ఎప్పుడూ పరిచివుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా అంటే ప్యాషన్. అందరి హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా సినిమానే ఊపిరిగా జీవిస్తున్న నిర్మాతలు రవి గారు నవీన్ గారు. ఒక మంచి సినిమాకి పని చేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్న మాకు ప్రేక్షకులు ఇంత ఘన విజయం ఇచ్చారంటే.. మా వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి మమ్మల్ని పోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్లుందరికీ శిరస్సువంచి కృతజ్ఞతలు తెలియజేశారు.