Viral ఢిల్లీలో రెస్టారెంట్ నరేంద్ర మోడీ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ రెస్టారెంట్ ఓ అద్భుతమైన ఆఫర్ను పెట్టింది. 56 వంటకాలతో ఉన్న ఓ థాలీని ఆరగించిన వారికి అద్భుతమైన బహుమతులు అందించనుంది..
భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సెప్టెంబర్ 17 ఈ సందర్భంగా ఢిల్లీలోని లుట్టియన్స్ లోని పది రోజులు పాటు ఈ ఆఫర్ ని ఉంచనుంది. 56 వంటకాలతో ఉన్న ఈ థాలీని తిన్న వాళ్లకి 8.5 లక్షలు ఇవ్వనున్నారు. అంతే కాకుండా వచ్చిన వాళ్ళకి ఉచితంగా కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు..
ఈ విషయాన్ని స్వయంగా రెస్టారెంట్ యజమాని సువీత్ కల్రా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను పెద్ద అభిమానినని.. తన రెస్టారెంట్ థాలీలకు ప్రసిద్ధి చెందినదని తెలిపారు. 56 అంగుళాల థాలీ అనేది 56 వంటకాలతో కలిపి ఒకే థాలీగా ఉంటుంది.. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధానిని గౌరవించడం కోసమే ఇదంతా అని చేస్తున్నాం అన్నారు. ఈ థాలీకి 56 అంగుళాల మోదీజి అని పేరు పెట్టాం అని కల్రా చెప్పారు. ఇందులో ఉత్తర భారత్ కి చెందిన 56 వంటకాలు ఉంటాయి. వీటి ధరల మధ్యాహ్నం వెజిటేరియన్ థాలీ రూ.2,600లు, నాన్ వెజ్ థాలీ ధర రూ.2,900 గా ఉంది.