‘కార్తికేయ 2’ నేషన్వైడ్ బ్లాక్బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చరణ్ తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పై కె రాజ శేఖర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
జూన్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ.. నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. హ్యాపీ డేస్ లో పక్కింటి కుర్రాడి పాత్రతో మొదలుపెట్టి స్వామిరారా, కార్తికేయ తో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసి కార్తికేయ2 తో బాక్సాఫీసుని షేక్ చేశాడు. ఇప్పుడు స్పై తో ముందుకు రాబోతున్నాడు. తన జర్నీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. స్పై జోనర్ సినిమాలు చేయడం అంత తేలిక కాదు. ఓటీటీ లో ప్రేక్షకులు వరల్డ్ కంటెంట్ ని చూస్తున్నారు,. ఐతే స్పై ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది.
ఇంటర్ నేషనల్ గా అనిపించింది. ఆజాదీ పాట కూడా చాలా నచ్చింది. నిర్మాతలకు అభినందనలు. టెక్నికల్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ఐశ్వర్య, సాన్య వెల్ కం టు టాలీవుడ్. ఆర్యన్ రాజేష్, జిషు, అభినవ్ అందరికీ ఆల్ ది బెస్ట్. దర్శకుడి గా పరిచయం అవుతున్న గారీకి ఆల్ ది బెస్ట్. ఆయన నుంచి మరిన్ని సినిమాలు రావాలి. నిఖిల్ కార్తికేయ 2తో ఒక ట్రెండ్ సెట్ చేశారు.స్పై తో ఆ ట్రెండ్ ని దాటి నెక్స్ట్ లెవల్ కి వెళ్తారని నమ్ముతున్నాను. 29న ‘స్పై’ ని థియేటర్ లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.