యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేసారు.
ఈ సందర్భంగా, `మాచర్ల నియోజకవర్గం` ఫస్ట్ ఛార్జ్ పేరుతో ఫస్ట్ లుక్ కి సంబంధించిన అప్డేట్ తో మేకర్స్ ముందుకు వచ్చారు. వినూత్నం గా మార్చి 26న ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్నట్లుగా ప్రభుత్వ ఉత్తర్వు శైలిలో ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు, : “ఐఏఎస్ అధికారి యొక్క కింది పోస్ట్ తక్షణమే అమలులోకి వస్తుంది – శ్రీ ఎన్ . సిద్ధార్థరెడ్డి, IAS (2022) గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. తన మొదటి ఛార్జ్ని మార్చి 26న ఉదయం 10:08 గంటలకు తీసుకుంటున్నారు. అంటూ ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు.
గుంటూరులో జిల్లా కలెక్టర్ గా కథానాయకుడు ఎదుర్కోబోయే సవాళ్లను సూచించేదిగా ఈ ఆర్డర్ కాపీ ఎర్రటి మరకలతో నిండి ఉంది. రాజకీయ నేపథ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. అనుభవం గల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు.