Movie కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్హాసన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచిన చిత్రం ‘విక్రమ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ.500కోట్లకు పైగా వసూళ్లను అందుకుని.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది..
అయితే ఈ చిత్రంపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ స్క్రీన్ ప్లే అద్భుతంగా అందించారని మెచ్చుకున్నారు. కమల్హాసన్ బాడీ లాంగ్వేజ్కు సరిపోయే కథ ఇది కాదని.. అయినప్పటికీ విక్రమ్గా ఆయన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు.
”త్రిమూర్తులు ప్రపంచానికి ఎలాగో. ఈ చిత్రానికి కమల్హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి.. ముగ్గురూ మూడు స్తంభాలు. నాలుగో స్తంభం దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ముగ్గురు హీరోలను ప్రధాన పాత్రలుగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించినప్పటికీ మిగిలిన ఎన్నో పాత్రలు కూడా సినిమా విజయంలో ప్రముఖ పాత్ర వహించాయి.. ఈ మధ్యకాలంలో స్క్రీన్ప్లేలో వచ్చిన కొత్త ఒరవడి కనురెప్ప వేయకుండా చూస్తేనే సినిమా అర్థమయ్యేలా ఉంటుది. అలాంటి చిత్రాల్లో ‘విక్రమ్’ ఒకటి.” అన్నారు. మాదకద్రవ్య రహిత దేశంగా భారత్ను చూడాలనుకోవడమే లక్ష్యంగా కమల్హాసన్ పాత్ర తీర్చిదిద్దారు. ఈ కథలో అంతర్గతంగా మూడు కథలు చూపించారు. సాధారణంగా సినిమా కథలో ఎప్పుడూ రెండు భాగాలుంటాయి. సాంఘిక, సామాజిక అవగాహన నేపథ్యం ఒకటి. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడం అలాంటిదే. కొంతమంది తెలివి తేటలతో వ్యక్తిగతమైన కథలను కూడా ప్రధాన కథలోనే మిళితం చేసి చూపిస్తారు.